Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోళిక అనే రాక్షసి అలా చచ్చింది.. అందుకే హోళీ పండుగ వచ్చిందా?

హోళీ పున్నమి మార్చి 2 (శుక్రవారం) రానుంది. ప్రతి ఏడాది రంగపంచమి అదే హోళీ రోజున భగవంతుడైన శ్రీకృష్ణుడికి రాధపై వున్న ప్రేమకు చిహ్నంగా కొనియాడుతారు. బృందావనంలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఉత్

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:32 IST)
హోళీ పున్నమి మార్చి 2 (శుక్రవారం) రానుంది. ప్రతి ఏడాది రంగపంచమి అదే హోళీ రోజున భగవంతుడైన శ్రీకృష్ణుడికి రాధపై వున్న ప్రేమకు చిహ్నంగా కొనియాడుతారు. బృందావనంలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఉత్తరాదిన అట్టహాసంగా జరుపుకుంటారు. దక్షిణాదిన ఈ పండుగను జరుపుకునే వారి సంఖ్య ఈ మధ్య బాగానే పెరిగిపోతుంది.
 
భగవంతుడైన శ్రీకృష్ణుడు గోపికలతో తన కుచేష్టల ద్వారా ఈ పండుగను ప్రసిద్ధి చెందేలా చేశాడని విశ్వాసం. హోళీకి ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోళిక దహన్ (హోళికను కాల్చడం) లేదా చోటీ హోళి (చిన్న హోళి) అని అంటారు. హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి ప్రహ్లాదుని మంటల్లో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోళిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో హోళిక దహన్‌ను కామ దహనం అని అంటారు. 
 
హోలిక అను రాక్షసి అనే రాక్షసి రోజుకు ఒక చంటిబిడ్డను తింటూ, ఒక గ్రామవాసులందరికి గర్భశోకాన్ని కలిగించేదట. ఇలా ఒకరోజు ఒక ముదుసరి మనువడి వంతు వచ్చిందట. అది గమనించిన ఆ వృద్ధురాలు హోళిక రాక్షసి నుంచి మనుమడిని తప్పించుకునేందుకు, ఆ గ్రామస్తుల గర్భశోక బాధను నివారించుటకై ఆ మహిమాన్వితుడైన మహర్షిని వేడుకొంటుంది. 
 
అందుకు ఆ రుషి తల్లీ.. ఆ రాక్షసి ఒక శాపగ్రస్తురాలు, ఎవరైనా ఆ రాక్షసిని నోటికిరాని దుర్భాషలతో తిడితే దానికి వెంటనే ఆయుక్షీణమై మరణిస్తుందని చెబుతాడు. అందుకోసం గ్రామస్తులను పోగుచేసి ఆ విధంగా దుర్భాషలాడమని తరుణోపాయం చెప్పినాడు. దానితో ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో గ్రామంలోనికి వెళ్లి రుషి తరుణోపాయం గ్రామస్తులకు చెబుతుంది. ఆ మరుసటి రోడు ఆ గ్రామస్తులందరిచేత ఆ ముదుసలి ఆ రాక్షసిని అనరాని మాటలనిపిస్తుంది. 
 
ఆ దుర్భాషలను తట్టుకోలేక కొండంత హోళి రాక్షసి కుప్పకూలి మరణిస్తుంది. దానితో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ కట్టెలు ప్రోగు చేసి ఆ చితిమంటలో హోళిరాక్షసిని కాల్చివేచి వసంతాలు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు. నాటి నుంచే హోళం పండుగ వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా హోళి పండుగ రోజు పితృదేవతలను పూజల ద్వారా సంతృప్తిపరిచి... తర్పణాలు సమర్పిస్తే వంశాభివృద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

వావ్... మనం గెలిచాం, ఎగిరి కౌగలించుకున్న కుక్క (video)

Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్

Telangana: తెలంగాణలో సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం

అన్నీ చూడండి

లేటెస్ట్

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

Tapeswaram: తాపేశ్వరం లడ్డూల తయారీకి పూర్వ వైభవం.. గణేష్ పండల్ నుంచి ఆర్డర్లు

TTD: మోసాలకు అడ్డుకట్ట: భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌

23-08-2025 శనివారం దిన ఫలితాలు - మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది...

తర్వాతి కథనం
Show comments