Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీ వేడుకకు దూరంగా రాంనాథ్ : రాష్ట్రపతి భవన్ ప్రకటన

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (15:47 IST)
కరోనా వైరస్ భయం నేపథ్యంలో హోలీ వేడుకకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈసారి హోలీ వేడుకను నిర్వహించడం లేదని రాష్ట్రపతిభవన్‌ తెలిపింది. 
 
ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ట్వీట్‌ చేస్తూ 'కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి, దీన్ని నిరోధించడానికి అందరం కృషి చేద్దాం. హోలీ వేడుకలను ఈ సారి నిర్వహించడం లేదు' అని పేర్కొంది.
 
కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని జనసందోహంతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయమే ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. 
 
తాను కూడా ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేర్వేరుగా తెలిపారు. ఢిల్లీ ఘర్షణల నేపథ్యంలో హోలీ వేడుకలను జరుపుకోవద్దని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

14-04-2025 సోమవారం ఫలితాలు : పెట్టుబడులకు తరుణం కాదు...

13-04-2025 ఆదివారం ఫలితాలు : మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments