Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివునికి పాలతోనే ఎందుకు అభిషేకం చేస్తారు..? (video)

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (05:02 IST)
శివుడు అభిషేక ప్రియుడు అనేది జగమెరిగిన సంగతే. ఎన్నో రకాల అభిషేకాలు శివయ్యకు చేస్తూ ఉంటాం. మరి అన్ని అభిషేకాల్లోకి పరమేశ్వరుడుకి అత్యంత ప్రీతికరమైన అభిషేకం పాలతో చేసేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే చాలా మందికి శివలింగానికి పాలతోనే అభిషేకం ఎందుకు చేస్తారనే అనుమానం వుంటుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 
 
శివరాత్రి రోజు, మహాశివుడు తాండవం ఆడతాడని భక్తులు అపార నమ్మకం. తాండవం చేయడం అంటే, విశ్వాన్ని సృష్టించేది. విశ్వాన్ని ప్రళయంతో అంతం కూడా చేస్తుంది. తాండవం ఆడుతూ ఉగ్రంగా ఉండే శివుడిని శాంతింపజేయడానికి పాలను ఎంచుకున్నారు. 
 
ఎందుకంటే పాలు అనేది సాత్విక ఆహారం. కాబట్టి ఆయనకు పాలతో అభిషేకం చేస్తారు. అంతేకాకుండా పాలతో పాటు తేనెను కూడా అభిషేకాల్లో శాంతింప చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. 
 
మహాశివరాత్రి రోజే సముద్ర మథనం ద్వారా ఉద్భవించిన విషాన్ని మహాశివుడు తన కంఠంలో దాచుకోవడ౦తో శివుడికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ సమయంలో భగభగ మండిపోతున్న శివుడి గొంతును ఉపశమింపజేయడానికి దేవతలు పాలు పోయడంతో శివుడు శాంతించాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అందుచేత పాలతో అభిషేకం చేసిన వారికి ఈతిబాధలు వుండవని.. దారిద్ర్యం తొలగిపోతుందని వారు సెలవిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

MBBS Student: వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

తెలంగాణ: రూ.5.21 లక్షల అబార్షన్ కిట్లు, మందులు కూడా స్వాధీనం

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-06-2025 ఆదివారం దినఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

01-06-2025 నుంచి 30-06-2025 వరకు మీ మాస ఫలితాలు

Weekly Horoscope: 01-06-2025 నుంచి 07-06-2025 వరకు మీ వార ఫలితాలు

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

తర్వాతి కథనం
Show comments