Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివునికి పాలతోనే ఎందుకు అభిషేకం చేస్తారు..? (video)

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (05:02 IST)
శివుడు అభిషేక ప్రియుడు అనేది జగమెరిగిన సంగతే. ఎన్నో రకాల అభిషేకాలు శివయ్యకు చేస్తూ ఉంటాం. మరి అన్ని అభిషేకాల్లోకి పరమేశ్వరుడుకి అత్యంత ప్రీతికరమైన అభిషేకం పాలతో చేసేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే చాలా మందికి శివలింగానికి పాలతోనే అభిషేకం ఎందుకు చేస్తారనే అనుమానం వుంటుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 
 
శివరాత్రి రోజు, మహాశివుడు తాండవం ఆడతాడని భక్తులు అపార నమ్మకం. తాండవం చేయడం అంటే, విశ్వాన్ని సృష్టించేది. విశ్వాన్ని ప్రళయంతో అంతం కూడా చేస్తుంది. తాండవం ఆడుతూ ఉగ్రంగా ఉండే శివుడిని శాంతింపజేయడానికి పాలను ఎంచుకున్నారు. 
 
ఎందుకంటే పాలు అనేది సాత్విక ఆహారం. కాబట్టి ఆయనకు పాలతో అభిషేకం చేస్తారు. అంతేకాకుండా పాలతో పాటు తేనెను కూడా అభిషేకాల్లో శాంతింప చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. 
 
మహాశివరాత్రి రోజే సముద్ర మథనం ద్వారా ఉద్భవించిన విషాన్ని మహాశివుడు తన కంఠంలో దాచుకోవడ౦తో శివుడికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ సమయంలో భగభగ మండిపోతున్న శివుడి గొంతును ఉపశమింపజేయడానికి దేవతలు పాలు పోయడంతో శివుడు శాంతించాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అందుచేత పాలతో అభిషేకం చేసిన వారికి ఈతిబాధలు వుండవని.. దారిద్ర్యం తొలగిపోతుందని వారు సెలవిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

లేటెస్ట్

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

తర్వాతి కథనం
Show comments