కుంకుమ ధారణ అనేది కేవలం..?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:40 IST)
స్త్రీలు కుంకుమ బొట్టుకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ వుంటారు. ఆధునిక కాలంలో నుదుటున కుంకుమ బొట్టుకు బదులుగా, వివిధ రకాల బొట్టు బిళ్లలను వాడడం అలవాటుగా మారిపోయింది. వస్త్రాలకు తగిన రంగు బొట్టును ధరించాలనే ఆలోచనే ఇందుకు కారణమైంది. అయితే నుదుటున కుంకుమ బొట్టు తప్ప మరేది ధరించినా ఆధ్యాత్మిక పరమైన దోషం... అనారోగ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. 
 
రెండు కనుబొమల మధ్య అగ్నితత్త్వం ఉంటుందనీ, దానిని చల్లబరచడం కోసమే ఆ ప్రదేశంలో కుంకుమ దిద్దడం జరుగుతోందని, కుంకుమ దిద్దకపోవడం వలన ఇక్కడి నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రతి వారికి కూడా నుదురు అనేది ఒక శక్తిమంతమైన కేంద్రంగా వుంటుంది. ఇతరుల దృష్టి నేరుగా ఈ ప్రదేశంలో పడడం వలన ఆ వ్యక్తుల సహజమైన శక్తి బలహీనపడే అవకాశముంది. 
 
అందువలన ఇతరుల దృష్టిని నిరోధించేదిగా ఆ ప్రదేశంలో కుంకుమ దిద్దుకోవడం అనాదిగా వస్తోంది. కాబట్టి కుంకుమ ధారణ అనేది కేవలం అందానికి ... అలంకారానికి మాత్రమేనని భావించకుండా, మన ఆచార వ్యవహారాలని గౌరవిస్తూ వాటిని అనుసరించవలసిన అవసరం అందరిపైనా వుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులకు, సైన్యానికి జీతాలు ఇవ్వలేక ఇరాన్ చస్తోంది, మరికొన్ని రోజులు చూస్తా: ట్రంప్ ఎద్దేవా

ప్రపంచంలోని 20 అత్యంత వేడి నగరాల జాబితా- భారత్‌లోనే 19 నగరాలు

తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్.. మొత్తం 75,064 పోలింగ్ బూత్‌లు సిద్ధం

గెటౌట్ ఆఫ్ హియర్ అంటూ మహారాష్ట్ర మంత్రిపై మహిళ చిందులు.. వీడియో వైరల్...

సర్‌ప్రైజ్ ప్రపోజ్ పేరుతో ప్రియుడి కళ్ళకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు...

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2026 ఆదివారం ఫలితాలు : ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి..?

తర్వాతి కథనం
Show comments