Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు పూటలా 20 మి.లీ తులసి రసంలో అది కలిపి తీసుకుంటే...

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (21:25 IST)
తులసిని పరమ పవిత్ర దేవతా స్వరూప మొక్కగా లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా భావించి ఆరాధించడం మన దైనందిన జీవన విధానంలోని శ్రేష్ఠమైన అత్యున్నతమైన సదాచారం. తులసిని సంపదకి, సౌభాగ్యానికి చిహ్నంగా భావించడంతో పాటు ఆ తల్లి కరుణాకటాక్షవీక్షణాలు మన శారీరక, మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుతుందనీ విశ్వసిస్తాం. ఈ తులసిలో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
 
1. 200 మి.లీ.ల నీటిలో గుప్పెడు తులసి ఆకులు, ఒక టీ స్పూను పంచదార కలిపి 100 మి.లీ.ల నీరు మిగిలేలా సన్నని మంట పైన మరిగించి వడకట్టి పూటకు 50 మి.లీ.ల టొప్పున సేవిస్తుంటే దగ్గు, జలుబు, జ్వరాలు తగ్గుతాయి.
 
2. 100 మి.లీ మరుగుచున్న నీటిలో పది తులసి ఆకులు, ఒక గ్రాము యాలుకుల పొడి వేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి తేనె కలిపి తాగాలి. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
 
3. వారానికోసారి రాత్రిపూట తలకి తులసి రసం పట్టించి ఉదయం తలస్నానం చేస్తుంటే పేల సమస్య తగ్గుతుంది. రొజూ రెండు పూటలా పూటకు 20 మి.లీ తులసి రసంలో 5 మి.లీ తేనె కలిపి తీసుకుంటుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 
 
4. రోజూ ఒకసారి 100 మి.లీ నీటిలో 10 తులసి ఆకులు, అర టీస్పూను అతిమధుర చూర్ణం, అర టీ స్పూను తాటి కలకండ వేసి మరిగించి దించి చల్లార్చి వడకట్టి 100 మి.లీ కాచిన పాలు కలిపి సేవిస్తుంటే బాలింతల్లో పాలు సమృద్ధిగా ఏర్పడతాయి.
 
5. నీడలో ఎండించి వస్త్ర గాలితం పట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని రోజూ రెండు పూటలా పూటకు 1-2 గ్రాముల వంతున తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఇదే చూర్ణాన్ని ముక్కుపొడుంలా పీలుస్తుంటే ముక్కు దిబ్బడ, జలుబు, తుమ్ములు, తలనొప్పి, సైనసైటిస్ వంటి వ్యాధులు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments