Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాసు మంచినీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే?

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (21:52 IST)
ఒకవైపు కరోనావైరస్ ఇంకోవైపు శీతాకాలంలో తుఫాను వర్షాలు. ఈ నేపధ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఎక్కువ. అందులో మరీ దగ్గు, జలుబు ముందుంటాయి. ఈ లక్షణాలు కనబడితే ఇప్పుడు కరోనావైరస్ అనే భయం కూడా వెంటాడుతోంది. ఐతే అన్ని లక్షణాలు కరోనావైరస్ కావు. అందువల్ల పొడిదగ్గు వచ్చిన వెంటనే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే తగ్గుతుంది. అవేంటో చూద్దాం.
 
1. అరకప్పు నీటిలో ఒక స్పూన్‌ పసుపు, ఒక స్పూన్‌ మిరియాల పొడి, ఒక స్పూన్‌ తేనె వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి.
 
2. దగ్గు విడవకుండా వస్తున్నట్లయితే టేబుల్‌ స్పూన్‌ తేనె తీసుకుంటే మంచిది.
 
3. నిద్రించే ముందు అల్లం టీ తాగితే మంచిది.
 
4. దగ్గు బాధిస్తున్నప్పుడు ఫ్లాట్‌గా ఉన్న బెడ్‌పై పడుకోకుండా తలపై దిండ్లను ఎత్తుగా పెట్టుకోవాలి. దీనివల్ల గొంతులో కొంచెం గరగర రాకుండా ఉంటుంది.
 
5. గ్లాసు నీటిని గోరు వెచ్చగా వేడి చేసి చిటికెడు ఉప్పు వేసి పుక్కిలించాలి. 
 
6. గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే కూడా ఫలితం ఉంటుంది. 
 
7. వేడి పాలలో ఒక స్పూన్‌ తేనె కలుపుకుని తాగితే పొడి దగ్గునుంచి త్వరిత ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments