Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరం బరువు పెరగకుండా ఉండేందుకు ఇలా చేస్తే సరి...

కొన్ని రకాల పదార్థాలు మానేసి మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటు చేసుకోవల్సిన మార్పులు మరికొన్ని ఉన్నాయి. ఉదయాన్నే అల్పాహారం, రెండుపూటల భోజనం.... ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీ

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (20:10 IST)
కొన్ని రకాల పదార్థాలు మానేసి మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటు చేసుకోవల్సిన మార్పులు మరికొన్ని ఉన్నాయి. ఉదయాన్నే అల్పాహారం, రెండుపూటల భోజనం.... ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తక్కువ కేలరీలు అందుతాయి. శరీరం ఇన్సులిన్‌ను తక్కువగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అదే ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువూ అదుపులో ఉంటుంది.
 
ఆకలితో సంబంధం లేకుండా మీముందు ఎంత ఎక్కువ ఆహారం ఉంటే అంత ఎక్కువగా తినేస్తారని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. దీన్ని అధిగమించాలంటే చిన్న పళ్ళెం తీసుకుని కొద్దిగానే వడ్డించుకోవాలి. దానివల్ల తెలియకుండానే తక్కువగా తీసుకుంటాం. కాఫీ, టీలు తాగే గ్లాసులకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎంత బిజీగా ఉన్నాసరే అన్నం ఒక్కటే కాదు. అల్పాహారం, స్నాక్స్ ఏవయినాసరే భోజనం చేసే డైనింగ్ టేబుల్ దగ్గర తినాలనే నియమాన్ని పెట్టుకోండి. ఫలితంగా టీ.వి, కంప్యూటరు ముందు కూర్చొని తినే అలవాటు తప్పుతుంది.
 
నోరూరించే పదార్థాలు ఎన్ని చేసుకున్నాసరే పచ్చి కూరగాయ ముక్కలు కూడా మీ ముందు ఉండేలా చూసుకోవాలి. ముందు వాటిని తిన్నాకే ఇతర పదార్థాలను తినాలనే నియమాన్ని పెట్టుకోవాలి. దానివల్ల పొట్ట నిండినట్లుగా ఉంటుంది. కేలరీలు తగ్గుతాయి.
 
ఐస్‌క్రీం తినే అలవాటును తగ్గించుకోండి. ఉదయాన్నే అల్పాహారం తిన్నాక ఓ గ్లాసు బత్తాయి, కమలా ఫలం రసం తాగండి. వాటివల్ల తక్కువ కేలరీలు అందుతాయి. శరీర బరువు అదుపులో వుంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments