చింతచిగురును వాటిలో కలిపి పేస్టులా చేసి దాన్ని అక్కడ రాసుకుంటే?

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (21:35 IST)
చింతచిగురు పప్పుతో కూర చేసుకుని అన్నంలో కలుపుకుని తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా మనకు తృప్తి కలుగుతుంది. చింతచిగురు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు.
 
చింతచిగురు పప్పులో వాడడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. బెణుకులకు, పాత నొప్పులకు చింత చిగురు దివ్యౌషధంలా పనిచేస్తుందట. చింతచిగురును బెల్లంతో నూరి నొప్పులున్న చోట పట్టువేసినట్లయితే నొప్పులు తగ్గిపోతాయట. రక్తహీనత సమయంలో చింతచిగురు వంటలు ఇంగ్లీష్ మందుల్లా పనిచేస్తాయట. చింతచిగురు కూర కీళ్ళ నొప్పుల నివారణకు ఎంతగానో పనిచేస్తుందట.
 
చింతచిగురును కొబ్బరిపాలలో కలిపి బాగా నూరి దానిలో పసుపు, పచ్చ, కర్పూరాన్ని కలుపుకుని పేస్ట్‌గా మారేవరకూ కలిపి, ఆ పేస్టును ఓ ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరుచుకుని ముఖంపైన మొటిమలు గాని, మచ్చలు గానీ ఉన్నట్లయితే ఆ పేస్టును ముఖానికి పూసి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలట. 
 
ఇలా చేస్తే ముఖం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుందట. ఇలా పది, పదిహేనురోజులు చేసినట్లయితే ముఖంపై మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రక్షణ కల్పించాలంటే పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిని పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..

వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో అగ్రస్థానంలో పాకిస్థాన్

నిప్పుల కొలిమిగా తెలంగాణ - ప్రతాపం చూపుతున్న భానుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

తర్వాతి కథనం
Show comments