గొంతు బొంగురుపోతుందా? ఐతే ఇలా చేస్తే సరిపోతుంది...

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (23:45 IST)
తులసి రసం కొంచెం తేనెలో కలిపి ప్రతిరోజూ తీసుకుంటుంటే బొంగురుపోయిన కంఠం చక్కగా అవుతుంది. తులసి ఆకులు మెత్తగా నూరి శరీరానికి పూసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మవ్యాధులు నయమవుతాయి. 
 
మామిడి ఆకుల నుంచి తీసిన పసరు కొద్దిగా వేడి చేసి చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది.
 
పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజూ రాత్రిపూట ముఖానికి రాసుకుని ప్రొద్దుటే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. 
 
వేపాకులను వేడినీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద వున్న ఎలాంటి మచ్చలైనా త్వరగా పోతాయి. 
 
ఒక కప్పు వేపాకులు కొద్దినీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడగట్టి ముఖం కడుక్కున్న తర్వాత ముఖానికి రాసుకుంటే ఆయిల్ స్కిన్ వారికి అస్ట్రిజెంటులా పనిచేస్తుంది. 
 
వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే జుత్తు ఊడటం తగ్గి నల్లగా పొడవుగా పెరుగుతుంది. రాత్రిపూట దిండు మీద తలసి ఆకులు వుంచుకుని పడుకుంటే తలలో పేలు మాయమవుతాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య - సీఎం చంద్రబాబు ఫోనులో పరామర్శ

ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న హైస్కూల్ ఉద్యోగిని

నన్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తావా? మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

ఆ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను తిరిగి పునరుద్ధరించిన రైల్వే శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments