సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

ఠాగూర్
గురువారం, 27 నవంబరు 2025 (12:56 IST)
వేసవికాలంలో మామిడి పండు ఎలాగో.. శీతాకాలంలో లభించే పండ్లలో అతి మధురమైన ఫలం సీతాఫలం. ఈ ఫలాలు రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లను కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరగించకూడదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా అలెర్జీతో బాధపడేవారు, జీర్ణసమస్యలు ఉన్నవారు, అధిక ఐరన్ సమస్యలు ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు లేదా కడుపు నిండిన భావన వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. 
 
అలాగే, సీతాఫలం ఐరన్‌కు మంచిఫలం. అయితే, అధికంగా తీసుకుంటే అద శరీరంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. ఇది కడుపునొప్పి, వికారం, మలబద్దకం, కడుపు పొర, వాపు, పూతలు వంటి సమస్యలను కలిగిస్తుంది. కొంతమందికి సీతాఫలం ఆరగించడం వల్ల దురద, దద్దుర్లు, చికాకు లేదా ఇతర అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండటం ఎంతో మంచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

తర్వాతి కథనం
Show comments