Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వులు, తేనెతో పొట్ట వద్ద కొవ్వు కరిగిపోతుంది.. (video)

మహిళలు మూడు పదులు వయస్సు దాటితేనే బరువు పెరిగిపోతుంటారు. పొట్ట కూడా పెరిగిపోతుంది. అలా పొట్ట పెరిగిపోతూపోతే.. వెంటనే తేనె, నువ్వులు డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనె, నువ్వు

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (17:32 IST)
మహిళలు మూడు పదులు వయస్సు దాటితేనే బరువు పెరిగిపోతుంటారు. పొట్ట కూడా పెరిగిపోతుంది. అలా పొట్ట పెరిగిపోతూపోతే.. వెంటనే తేనె, నువ్వులు డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

వీటిని తీసుకోవడం ద్వారా మహిళల్లో ఎముకలకు సంబంధించిన నొప్పులను దూరం చేసుకోవచ్చు. తద్వారా మహిళల్లో వెన్నునొప్పి వంటి సమస్యలుండవు. ఎదిగే పిల్లలకు కూడా తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. పోషణ సరిగ్గా అందుతుంది. 
 
మహిళలు నువ్వుల పొడిని రెండు స్పూన్లు తీసుకుని ఒక స్పూన్ తేనెతో రోజూ తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. పొట్ట వద్ద ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. ఆకలిని తగ్గించడం వల్ల తిండి అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రావు. 
 
ఇలా నువ్వులు-తేనె కలిపి తీసుకోవడం ద్వారా రోజంతా చురుగ్గా వుంటారు. ఎంత పనిచేసినా అలసిపోరు. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. వాపులు పోతాయి.

నొప్పులు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య పోతుంది. జుట్టు రాలడం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

జగన్నాథ రథయాత్రలో అపశృతి : ముగ్గురి మృతి

బీహార్‌లో మొబైల్ ఓటింగ్.. దేశంలోనే తొలిసారి..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments