Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీలను ఇలా జాగ్రత్తగా చూస్కోవాలి....

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (22:22 IST)
కిడ్నీలు శరీరంలో ఉండే అతి ముఖ్య అవయవాలు. రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుభ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మలినాలు తొలగించే ప్రక్రియలో వీటిలో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్‌లు రావొచ్చు. అందకే కిడ్నీలో ఉన్న మలినాలను తరుచు బయటకు పంపించడం మంచిది. కిడ్నీలలో మలినాలను సహజంగా ఎలా బయటకు పంపించాలో ఇప్పుడు చూద్దాం.
 
1. కిడ్నీలను సులభంగా శుభ్రపరచగల ఒకే ఒక సాధనం మంచినీళ్ళు. దాదాపుగా 8 నుండి 10 గ్లాసుల వరకు ప్రతిరోజు తాగాలి. ఇతరత్రా సమస్యలేం లేకుంటే ఇంకా ఎక్కువ కూడా తాగవచ్చు. నీళ్ళు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగించేస్తుంది. మూత్రం క్లియర్‌గా, ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటే సరిపడా నీరు తాగుతున్నరన్నమాట, లేకపోతే ఇంకా నీళ్ళు తాగాలి అన్నట్టు.
 
2. బార్లీ ధాన్యం కిడ్నీలను శుభ్రపరచడమే కాదు,  ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్. ఇది ఇంకా డయాబెటిస్ లాంటి వాటి నుండి కూడా సమర్థవంతంగా రక్షిస్తుంది. కొన్ని బార్లీ గింజలను రాత్రిళ్ళు నీళ్ళల్లో నానేసి, ఉదయాన్నే ఆ నీటిని త్రాగడంవాళ్ళ బార్లీలోని మంచి గుణాలను పూర్తిగా స్వీకరించవచ్చు.
 
3. తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండాలి. ద్రాక్ష, కమలాపండు, అరటిపండు, కివి, అప్రికాట్ లాంటి పండ్లలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా పాలు, పెరుగులో కూడా పొటాషియం పుష్కలంగానే ఉంటుంది. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ కిడ్నీలలో మలినాలను శుభ్రం చేస్తుంది. ఎందుకంటే.... వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్‌గా మారి కిడ్నీ లను సమర్దవంతంగా శుభ్రం  చేస్తుంది.
 
4. ఆల్కహాల్, చాక్లేట్, కేఫిన్ల వల్ల చాల దుష్ప్రభావాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల, వీటిని అరిగించే, కరిగించే క్రమంలో కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది. దీనితో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. అందుకే, వీటికి దూరంగా ఉండం చాలా మంచిది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments