Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో అనారోగ్యాల బారినపడకుండా ఉండాలంటే...

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (16:56 IST)
చాలామంది చలికాలంలో అనారోగ్యాల బారినపడుతుంటారు. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో పాటు మంచు, చలి, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో తీసుకునే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే అనారోగ్యంబారిన పడకుండా ఉండొచ్చు.
 
చలికాలంలో జలుబు, దగ్గు వంటివి సాధారణం. వాతావరణంలో మార్పులు, చల్లటి గాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండడమే అందుకు కారణం. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడకుండా రక్షణ పొందొచ్చు. అవేంటో ఓసారి చూద్ధాం.
 
అల్లం : తేనె కలిపిన అల్లం ముక్కలను లేదా అల్లం రసంగానీ రోజూ తీసుకున్నట్టయితే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణశక్తి సమస్యలు కూడా పరిష్కరమవుతాయి. 
 
పసుపు : ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు... ఓ గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గిపోవడమే కాకుడా, రోగ నిరోధకశక్తి కూడా తగ్గిపోతాయి. 
 
చిలగడదుంప : చలికాలంలో వీటిని క్రమంగా తీసుకున్నట్టయితే ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటిలో అధికంగా పీచుపదార్థం, విటమిన్ ఏ, పొటాషియం వంటి అధికంగా ఉంటాయి. 
 
నువ్వులు : శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో నువ్వులు బాగా పని చేస్తాయి. వారంలో మూడు రోజుల పాటు నూనెతో శరీరాన్ని బాగా మర్దన చేసుకుని స్నానం చేసినట్టయితే శరీరంలో వేడి పెరిగి, చలి నుంచి రక్షణ కల్పిస్తుంది.
 
ఎండు పండ్లు : జీడిపప్పు, వాల్ నట్స్, బాదం పప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు వంటివి పరిమితంగా తీసుకుంటే... శరీరానికి పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి చిట్కాలతో చలికాలంలో అనారోగ్యం బారినపడకుండా ఉండొచ్చు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments