Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మచెక్క రసానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి...

సాధారణంగా మహిళలలో ముఫ్పై ఏళ్ల తరువాత ఎముకలలో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు పెళుసుబారి పోవడం, కీళ్లనొఫ్పులు రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. సమతులాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను దాదాపు రాకుండా చేయవచ్చు. ఎముకలు ధృడంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (21:02 IST)
సాధారణంగా మహిళలలో  ముఫ్పై ఏళ్ల తరువాత ఎముకలలో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు పెళుసుబారి పోవడం, కీళ్లనొఫ్పులు రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. సమతులాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను దాదాపు రాకుండా చేయవచ్చు. ఎముకలు ధృడంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.
 
1. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో క్యాల్షియం, విటమిన్ -డి ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, తాజాపండ్లు, కాయగూరలు, గుడ్లు తీసుకోవడం వల్ల ఎముకలకు కావలసిన బలం చేకూరుతుంది. వీటికి అదనంగా చిరుధాన్యాలు, పండ్లరసాలు తీసుకుంటే మంచిది.
 
2. రోజు ఉదయం ఎండలో కాసేపు కూర్చోవటం వలన విటమిన్-డి పుష్కలంగా అందుతుంది. విటమిన్-డి మాత్రల్ని వాడినా సరిపోతుంది.
 
3. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరుబయట వ్యాయామం, పరుగు, నడక వంటివి చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు ఆరోగ్యంగాను ఉంటారు.
 
4. రాగి పిండిలో క్యాల్షియం శాతం ఎక్కువుగా ఉంటుంది. కనుక ప్రతిరోజు రాగిజావ కాచుకొని త్రాగడం వలన కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది.
 
5. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మచెక్క, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకోవడం వలన కీళ్లనొప్పుల సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మల్లారెడ్డి ఉమెన్స్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం, ఎందుకు?

రోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ బైకుపై విన్యాసాలు.. వీడియో వైరల్

మహా కుంభమేళాలో అబ్ధుల్ కలాం- మహాత్మా గాంధీ (ఫోటోలు)

RPF: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ పల్లబికి జీవన్ రక్ష పదక్ 2024 అవార్డ్.. ఎందుకో తెలుసా? (video)

Cow-King Cobra- ఆవుతో పాము స్నేహం వైరల్ వీడియో (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు

కన్నప్పలో విష్ణు మంచు, ప్రభాస్ పోరాట సన్నివేశాలు

ప్రజల కోసమే పవన్ ఆ పని చేసారు: పరుచూరి గోపాలకృష్ణ

గేమ్ ఛేంజర్ నష్టాలను రామ్ చరణ్ రికవరీ చేస్తున్నాడా?

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సంహారం

తర్వాతి కథనం
Show comments