Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా వుండాలంటే.. టీవీ చూస్తూ భోజనం చేయకూడదట..

Webdunia
గురువారం, 18 జులై 2019 (13:07 IST)
ఆరోగ్యంగా వుండాలంటే.. ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రత కొరవడితే ఒత్తిడి తప్పదు. అందుచేత ఏకాగ్రతను పెంచుకోవాలి. ఏకాగ్రత అనేది పెరగాలంటే.. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో మరింత శక్తి పెరుగుతుంది. అలాగే ఏకాగ్రత పెరిగేందుకు రోజూ కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయండి 
 
ఆరోగ్యంగా ఉండేందుకు ఏకాగ్రతతో భోజనం చేయాలి. టీవీ చూస్తూనో లేదా కంప్యూటర్‌తో పనిచేస్తూనో భోజనం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వార్తా పత్రికలు, పుస్తకాన్ని చదువుతూ భోజనం చేయకూడదు. దీంతో మీలో ఏకాగ్రత నశిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.  
 
వృత్తిని వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టకూడదు. ఈ రెండింటి మధ్య సత్సంబంధాలు కలిగి ఉండేందుకు ఏకాగ్రత చాలా అవసరం. ఇంకా జీవనశైలిని మార్చుకుంటే మీలో శక్తిసామర్థ్యాలు మరింతగా పెరుగుతాయి. దీంతో జీవితాంతం సుఖంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 
 
అలాగే ప్రతి రోజు క్రమం తప్పకుండా రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్రతో శరీరానికి మరింత శక్తిని అందించినవారవుతారు. నిద్రలేమితో ఒత్తిడి, కళ్ళకింద నల్లటి చారలు, అధిక రక్తపోటు తదితర సమస్యలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. కాబట్టి ప్రతి రోజు క్రమం తప్పకుండా కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments