కిడ్నీలో ఏర్పడే రాళ్లను ఖర్జూరాలు కరిగిస్తాయా?

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (21:25 IST)
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను, ఇన్‌ఫెక్షన్లని దూరం చేస్తుంది. రాత్రి పూట నీటిలో నాలుగు ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. ఖర్జూరంలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
 
ఇవి ఎముకల దృఢత్వానికి బాగా ఉపకరిస్తాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. దంతాలను దృఢపరచడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా జలుబు, గొంతులో శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్దప్రేగులోని సమస్యలను నివారిస్తాయి.
 
అత్యంత తియ్యగా ఉండే ఈ ఖర్జూరంలో గ్లూకోజ్, ప్రక్టోజ్‌లు అధికంగా ఉంటాయి. ఖర్జూరం రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండెకు సంబందించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది.
 
ఇందులో యాంటీఆక్సీడెంట్ల రూపంలో ఉండే విటమిన్-సి కంటికి చాలా మంచిది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
 
ఖర్జూరాలు ఆరోగ్యకరమైన బరువు పెంచడానికి సహాయపడుతాయి. బాగా సన్నగా ఉన్నవారు రోజూ ఖర్జూరాన్ని తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు. కాబట్టి రోజువారి ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments