Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో ఎండుద్రాక్ష వేసి మరుసటి రోజు ఆరగిస్తే...

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (13:24 IST)
ప్రతి ఒక్కరికీ భోజనంలో పెరుగుతినే అలవాటు ఉంటుంది. అలాగే, ఎండు ద్రాక్షను కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే, పెరుగులో ఎండుద్రాక్షను వేసి మరుసటి రోజు ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
గోరు వెచ్చని పాలను పెరుగుతో తోడు పెట్టే సమయంలోనే పాలలో ఒక టీ స్పూన్ ఎండుద్రాక్ష వేస్తే, మరుసటి రోజుకు ఎండుద్రాక్ష పెరుగు సిద్ధమవుతుంది. దీన్ని మధ్యాహ్న భోజనం తర్వాత లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
 
ఇలా తయారయ్యే పెరుగులో ప్రోబయాటిక్, ఎండుద్రాక్ష ప్రిబయాటిక్.. ఈ రెండింటి అరుదైన సమ్మేళనం అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగు పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ బ్యాక్టీరియాకు అవసరమైన ఆహారాన్ని ఎండుద్రాక్షలోని పీచు
సమకూరుస్తుంది.
 
ఈ రెండింటి సమ్మేళనం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, యుటిఐ, కొలెస్ట్రాల్, అకారణంగా బరువు పెరగడం, థైరాయిడ్, పిసిఒడిల నుంచి ఉపశమనం దక్కుతుంది. పెరుగుతో బరువు పెరుగుతామనేది అపోహ. ప్రతి రోజూ ఇలా ఎండుద్రాక్షలతో తయారుచేసుకున్న పెరుగును తినడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు. పెరుగు కోసం ఉపయోగించే పాలు వెన్న తీయని పాలై ఉంటే మరీ మంచిదిగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments