Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాత్రిపూట పెరుగు తింటే?

రాత్రిపూట పెరుగు తింటే?
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (23:05 IST)
పెరుగు తింటే ఆరోగ్యమే కానీ రాత్రిపూట పెరుగును తింటే అనారోగ్యాన్ని తెస్తుందని ఆయుర్వేదం చెపుతుంది. పెరుగు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకుందాము.
 
రాత్రిపూట పెరుగు తినడాన్ని ఆయుర్వేదం సిఫారసు చేయదు, ఎందుకంటే ఇది శ్లేష్మం ఏర్పడటానికి కారణమవుతుంది.
 
రాత్రిపూట పెరుగు తింటే నాసికా మార్గంలో శ్లేష్మం ఏర్పడుతుంది.
 
ఆర్థరైటిస్‌తో బాధపడేవారు పెరుగును రోజూ తినకూడదు.
 
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు సైతం రాత్రిపూట పెరుగు తినకూడదు.
 
శ్లేష్మాన్ని ప్రోత్సహించే గుణాల కారణంగా, ఆస్తమా, దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే వారు రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.
 
పెరుగును పగటిపూట లేదా మధ్యాహ్నం తినడం మంచిది.
 
కొంతమందికి పెరుగు తింటే మలబద్ధకం ఏర్పడుతుంది, అతిగా తీసుకోవడం వల్ల మాత్రమే ఈ సమస్య వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్త హీనతను అధిగమించేందుకు తాగాల్సిన రసాలు