Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ నీళ్లు, గ్లిజరిన్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే..

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (16:41 IST)
ఆరోగ్యానికి మేలు చేసే పొషక విలువలు కలిగిన పండ్లు అందానికి కూడా మేలు చేస్తాయి. వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని సందర్భాలలో ముఖంపై మురికీ, జిడ్డు పేరుకుపోతుంది. అలాంటి సమయంలో ఖరీదైన క్రీములు, పౌడర్లూ ఉపయోగించడం మూలంగా ఎలాంటి ఉపయోగం ఉండదు. అటువంటప్పుడు సహజంగా దొరికే పండ్లను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు.

ఆరంజ్‌ తొక్కలను బాగా ఎండబెట్టి, పొడిచేసుకోవాలి. ఒక స్పూన్‌ నారింజ పొడి తీసుకుని, దీనిలో పెరుగును కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. 20 నిమిషాల నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
పడుకునే ముందు గులాబీ నీళ్లూ, గ్లిజరిన్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, మర్నాడు ఉదయాన్నే కడిగేస్తే ముఖం నిగనిగలాడుతుంది.

ఒక టీస్పూన్‌ బొప్పాయి గుజ్జులో ముల్తానీ మట్టి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ ముఖాన్ని తాజాగా మారుస్తుంది. 
 
సెనగపిండిలో గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పట్టించి అరగంటయ్యాక కడిగేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. పుచ్చకాయ రసం, కమలా పండు రసం, దోసకాయ గుజ్జు... దేనినైనా ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే చర్మం కొత్తనిగారింపు సంతరించుకుంటుంది. గులాబీ  పూల రెక్కలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments