Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జలను నేతిలో వేయించి పొడి చేసి....

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (13:39 IST)
తృణధాన్యాలలో మంచి ఔషధ గుణాలుంటాయి... షౌష్టిక విలువలు అధికం. అయితే కొన్ని సంవత్సరాలుగా తృణధాన్యాల వాడకం తగ్గింది. తృణధాన్యాలు అంటే ధాన్యాలలో ఒక రకం. బొబ్బెర్లు, అనుములు, సజ్జలు, ఉల్వలు, గడ్డినువ్వులు, తైదలు, అవుశలు, కొరబియ్యం తదితరాలు తృణధాన్యాల కోవకు చెందినవి. ఇవి శరీరానికి మంచి పోషక విలువనిస్తాయి.. 
 
వీటితో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని వైద్యులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవిశలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. జలుబు, వాతాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, రేచీకటిని హరింపజేస్తాయి. విరేచనాలను అరికడతాయి. అవిశలను పొడి చేసుకొని ఆహారంలో తింటే రుచిగా ఉంటుంది. 
 
అలాగే తైదలను అంబలిగా కాచి సేవిస్తే శరీరానికి చలువను ఇస్తుంది. ఆకలి అదుపులో ఉంటుంది. తైదలలో లోహతత్వం ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి, తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది. 
 
బొబ్బర్లు ఉడకబెట్టి తినడం వలన బాలింతలకు శక్తి చేకూరుతుంది. ఇవి అసిడిటీ (ఆమ్లపిత్తం)ను తగ్గించి, ఆకలిని వృద్ధి పరుస్తాయి. వాతాన్ని అరికడుతాయి. మూత్రరోగాలను అరికడుతాయి. దేహపుష్టిని కలిగిస్తాయి. వీటితో పాటు బొబ్బర్లను పిండి వంటల్లో వాడితే మంచి రుచినిస్తాయి. 
 
అనుములను తినడం వలన పలు రోగాలను అరికట్టవచ్చు. బాలింతలలో పాలు వృద్ధిచెందుతాయి. విషం, వాపు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇవి చాలా పౌష్టికరమైనవి. సజ్జలను నేతిలో వేయించి పొడి చేసి పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి పాలలో కలిపి తాగిస్తే దేహదారుఢ్యాన్ని, మనోబుద్ధి పెంపొందుతుంది. 
 
బెల్లంలో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. ఉలవలలో తెలుపు, నలుపు, ఎరుపు మూడు రంగులు ఉంటాయి. నల్ల ఉలవలు శ్రేష్టమైనవి. ఇవి మూత్రరోగాలను తగ్గిస్తాయి. మూత్రాశయంలో పెరిగే రాళ్లను కరిగించే గుణం వీటిలో ఉంటుంది. వీటిని గుడాలు, అంబలి రూపంలో సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments