Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం స్నానం చేస్తున్నారా.. జాగ్రత్త..?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (10:30 IST)
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక ఆహారం తీసుకోవాలి. అలానే భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనుల కారణంగా అనారోగ్యాల పాలవుతున్నారు. మరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే.. భోజనం తరువాత ఎలాంటి పదార్థాలు తినాలి, తినకూడదనే విషయాన్ని తెలుసుకుందాం... 
 
భోజనం చేసిన తరువాత వెంటనే నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే.. తిన్న ఆహారం జీర్ణం కాక పలురకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన భోజనం చేసిన రెండు గంటల తరువాత నిద్రించాలి. అప్పుడే ఇలాంటి సమస్య రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
చాలామంది భోజనం తిన్న తరువాత స్నానం చేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదంటున్నారు వైద్యులు. భోజనాంతరం స్నానం చేస్తే కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. దాంతో పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కనుక వీలైనంతవరకు స్నానం చేసిన తరువాత భోజనం చేయండి.
 
కొందరైతే భోజనం చేసిన వెంటనే నడుస్తుంటారు. ఎవరైన అడిగేతే.. తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడానికి ఇలా చేస్తున్నానని చెప్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే.. భోజనాంతరం నడిస్తే.. తిన్న ఆహారంలోని పోషకాలు శరీరంలో చేరకుండానే జీర్ణమైపోతాయి. దాంతో శరీరానికి కావలసిన పోషకాలు అందకుండా పోతాయి. అందువలన భోజనం చేసిన వెంటనే నడవకుండా.. ఓ గంట తరువాత నడవండి చాలు.

సంబంధిత వార్తలు

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

తర్వాతి కథనం
Show comments