Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో చర్మ సంరక్షణ... ఈ చిట్కాలు పాటిస్తే...

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (20:11 IST)
సాధారణంగా చలికాలంలో చాలా మందికి చర్మం పొడిబారిపోతుంది. దీని నివారించడానికి రకరకాల క్రీములను వ్రాస్తుంటారు. దీని వలన అంతగా ప్రయోజనం ఉండదు. అలా కాకుండా మన ఇంట్లో లభించే పదార్ధాలతోనే మనం మన చర్మాన్ని మృదువుగా మార్చుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
 
1. టీ స్పూన్ ముల్తానీ మట్టి, టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ తేనె, పావు టీ స్పూన్ బాదం నూనెను పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజు చర్మం పొడిబారకుండా, కాంతివంతంగా తయారవుతుంది.
 
2. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబైల్, మరియు హ్యుమెక్టా లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి గొప్ప మాయిశ్చరైజ్‌గా పనిచేస్తుంది. దాంతో చర్మం సున్నితంగా మరియు స్మూత్‌గా మార్చుతుంది. తేనెలో విటమిన్స్ మరియు మినరల్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్నానం చేయడానికి ముందు మీ శరీరం మొత్తం తేనెను అప్లై చేసి పది నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత స్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
3. పెరుగు ఒక అద్భుతమైన స్కిన్ హైడ్రేటిగ్ ఏజెంట్. మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండి పొడి మరియు దురదపెట్టే చర్మాన్ని నివారిస్తుంది. పొడి చర్మం మరియు దురదకు గురిచేసే బ్యాక్టీరియా లేదా క్రిములను నాశనం చేసే ల్యాక్టిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా ఉంటుంది.

తాజాగా ఉన్న పెరుగు తీసుకొని, ముఖం, చేతులు మరియు కాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. 10 నిముషాలు అలాగే ఉంచి తర్వాత స్నానం చేసుకోవాలి. పెరుగులోని నాణ్యమైన గుణాలు డ్రై స్కిన్ తొలగిస్తుంది మరియు మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. దీన్ని ప్రతి రోజూ ఒక సారి చేస్తే సరిపోతుంది.
 
4. కలబంద చర్మంను సున్నితంగా మరియు నునుపుగా మార్చే మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం పొడిబారడాన్ని, దురదను నివారిస్తుంది. చర్మంపై ఉన్న మలినాలను తొలగిస్తుంది. కలబంద ఆకును కట్ చేసి తాజాగా ఉండే జెల్‌ను చర్మంపై రాసి 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చొప్పున చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments