Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో అధిక శక్తినిచ్చే పండ్ల రసాలు ఏవి?

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (10:38 IST)
గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడిమికి శరీరంలోని లవణాలన్నీ చెమల రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో మనిషికి నీరసం వస్తుంటుంది. ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ పండ్ల రసాలు, శీతలపానీయలాను నీటిని అధికంగా సేవిస్తున్నారు. అధికంగా నీళ్లు తాగడం, పళ్ల రసాలు తాగడం వల్ల ఎంతో మేలని వైద్యులు చెబుతున్న విషయం అందరికి తెలిసిందే. వీటి వల్ల ఆరోగ్యంగా ఉండటమేకాకుండా అలసిపోకుండా ఉంటాం. ఇంకా వడదెబ్బ నుంచి రక్షణ పొందుతాం.
 
వేసవిలో శక్తినిచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ కాలంలో ఎండల వేడి నుంచి తట్టుకునేందుకు వివిధ పళ్ల రసాలు ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అలసిపోకుండా ఉంటాము. ఇంకా వడదెబ్బ నుంచి రక్షణ పొందుతాము.
 
ఇక వేసవిలో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ. నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తిని కోల్పోకుండా ఉంటాము. వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. ఎండాకాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
 
పండ్ల రసాలను సేవించడం వల్ల కలిగే ఉపయోగాలను పరిశీలిస్తే, ఈ పండ్ల రసాలతో విటమిన్‌-ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి, మలబద్దంగా సమస్య తొలగిపోతుంది, ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు, కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండ చేస్తాయి, చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి, పేగుల్లో మలినాలు తొలగిపోయి శుద్ది చేస్తాయి, ఎసిడిటి, అల్సర్‌ సమస్యను నివారిస్తాయి, నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్‌లలో పోటాషియం బి6, బి1, బి2 విటమిన్స్‌ పుష్కలంగా అందుతాయి. అజీర్తి సమస్య దూరం అవుతంది. శరీరంలో నీటి శాతం పెరుగడం వల్ల బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. 
 
పుచ్చకాయలు ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. డయాబెటిస్‌ వ్యాధిని అదుపులో ఉంటుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలు తొలగిపోతాయి. ఇలా పండ్ల రసాలను ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో పండ్ల రసాలతోనే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అంటున్నారు. దాహం ఎక్కువగా ఉండటం, అందులో అహారం తక్కువ తీసుకోవడం జరుగుతుందని, అందుకే ఇతర పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌లను తీసుకోవడం కంటే పండ్ల రసాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. 
 
ఈ పండ్ల రసాలతో ఇలాంటి ప్రయోజనాలే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. ఈ జ్యూస్‌ల కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని, రక్తం శుద్ది అవుతుందని చెబుతున్నారు. వాటర్‌మిలన్‌ జ్యూస్‌ కాకుండా తీసుకుంటే ఇంకా ఎంతో మంచిదంటున్నారు. ఎండా కాలంలో ఎక్కువగా పండ్ల రసాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments