Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం... తస్మాత్ జాగ్రత్త.. జ్వరం - సీజనల్ వ్యాధులతో అప్రమత్తత

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (13:12 IST)
వర్షాకాలం వచ్చేంది. చిన్నపాటి వర్షంలో తడిసినా జలుబు, తుమ్ములు వచ్చేస్తాయి. వీటితో పాటు.. దగ్గులు, జ్వరాలు, వీరేచనాలు.. వంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి మనమీద వీర విహారం చేస్తాయి. అందుకే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సురక్షిత నీటిని తాగాలని చెబుతుంటారు వైద్యులు. 
 
వర్షంలో తడిసిన తర్వాత చలిజ్వరం, వణుకు వస్తే మలేరియా అని అనుమానం రావాలి. జ్వరం తగ్గి చెమటలు పట్టి మళ్లీ జ్వరం వస్తుంటుం ది. రక్త పరీక్షల ద్వారా మలేరియా ఉందో లేదో నిర్ధారించు కోవచ్చు. ఉంటే సకాలంలో సరైన వైద్యం చేయించాలి. 
 
వైరల్‌ ఫీవర్‌ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలన్ని డెంగ్యు వచ్చినప్పు డు కనిపిస్తాయి. జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, విరోచనాలు, దద్దుర్లు రావచ్చు. వైరల్‌ ఫీవర్‌తో మనలోని రోగ నిరోధక శక్తి నశిస్తుంది. 
 
కాబట్టి ఎక్కడబడితే అక్కడ నీళ్లు నిల్వ ఉంచుకుండా చూడాలి. అలా చేస్తే దోమ లు పెరిగే అవకాశాల్ని చాలా వరకు తగ్గించినట్లవుతుంది. అ లాగే ఇంటికి మెస్‌లు, మంచాలకు దోమతెరలు, మస్కిటో రి ప్లెంట్‌లు వాడి దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి.

సంబంధిత వార్తలు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్

లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

తాడేపల్లి ప్యాలెస్ నియంత జగన్ నుంచి ప్రజలకు విముక్తి!! అందుబాటులోకి రోడ్డుమార్గం!

డార్జిలింగ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు... నలుగురి మృతి?

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

తర్వాతి కథనం
Show comments