Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత కరెన్సీ నోట్లతో జాగ్రత్త... ఆ నోట్లు వ్యాధులను మోసుకొస్తాయ్ జాగ్రత్త

పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు పూర్తిస్థాయిలో విడుదలవుతున్నాయి. ఐతే ఈ కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొస్తాయంటే నమ్మబుద్దికాదు కానీ, ఇది జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికారక మైక్రో ఆర్గానిజమ్స్ డజన్లకొద్దీ కరెన్సీ నోట్లను అంటిపెట్టుక

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (22:58 IST)
పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు పూర్తిస్థాయిలో విడుదలవుతున్నాయి. ఐతే ఈ కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొస్తాయంటే నమ్మబుద్దికాదు కానీ, ఇది జరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికారక మైక్రో ఆర్గానిజమ్స్ డజన్లకొద్దీ కరెన్సీ నోట్లను అంటిపెట్టుకుని ఉంటాయట. రూ. 10, రూ. 20, రూ. 100 కరెన్సీ నోట్లపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు ఢిల్లీకి చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. ఈ కరెన్సీ నోట్ల కారణంగా సుమారు 78 వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ గుర్తించింది. 
 
వీటిలో చాలామటుకు ఫంగై, బ్యాక్టీరియా కారక రూపంలో నోట్లను అంటిపెట్టుకుని ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. వీటి ఫలితంగా డీసెంట్రీ, ట్యుబర్కులోసిస్, అల్సర్లు కూడా వచ్చే అవకాశం లేకపోలేదని చెపుతున్నారు. ఈ కరెన్సీ నోట్లు రోగాలను మోసుకొచ్చే వాహకాలుగా కూడా పనిచేసే అవకాశం ఉందని చెపుతున్నారు. 
 
ఐతే వాస్తవ రూపంలో ఇవి మనుషులపైన ఎంతమేరకు ప్రభావం చూపుతాయన్నది ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఐతే అవకాశం లేదని చెప్పలేమని కూడా అన్నారు. కరెన్సీ నోట్లను స్నాక్ దుకాణాలు, రోడ్లపై నడిపే దుకాణాదారులు, మార్కెట్లు వంటి వారి వద్ద నుంచి సేకరించి పరిశీలించినట్లు వారు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments