Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత అరుదైన క్యాన్సర్ లియోమియోసార్కోమాకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (18:10 IST)
విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) మంగళగిరి ఎడమ ఊపిరితిత్తుల దిగువ భాగంలో మెటాస్టాటిక్ లియోమియోసార్కోమాకు విజయవంతంగా చికిత్స చేసింది. లియోమియోసార్కోమా, లేదా LMS అనేది మృదువైన కండరాలలో పెరిగే అరుదైన క్యాన్సర్. ఈ మృదువైన కండరాలు  శరీరం లోని ప్రేగులు, కడుపు, మూత్రాశయం మరియు రక్తనాళాలతో సహా శరీరంలోని బోలు అవయవాలలో ఉంటాయి. ఆడవారిలో, గర్భాశయంలో కూడా ఈ  మృదువైన కండరం ఉంటుంది.
 
61 ఏళ్ల పురుషుడు, శ్రీ శ్రీహరి గుణశేఖర్ 2020లో లియోమియోసార్కోమాతో బాధపడ్డారు. ఆయన కొత్త సమస్యతో AOIకి వచ్చారు. చెక్-అప్ సమయంలో అతని ఎడమ ఊపిరితిత్తులో కొత్త సమస్య కనిపించింది. డాక్టర్ కళ్యాణ్ పోలవరపు- డాక్టర్ అమిత్ పాటిల్ నేతృత్వంలోని వైద్యుల బృందం అతని సంక్లిష్టమైన కేసును సవాల్‌గా తీసుకుంది. ఊపిరితిత్తుల సమస్యతో పాటు, శ్రీ చంద్రశేఖర్‌కు బృహద్ధమని, గుండె కవాటాలతో కూడా సమస్యలు ఉన్నాయి. వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళిక కోసం కార్డియాలజిస్ట్‌ని కూడా సంప్రదించవలసి వచ్చింది.
 
ఆయనకు నాలుగు అంచెల కీమోథెరపీతో చికిత్స ప్రారంభించబడింది. తర్వాత PET CT స్కాన్‌ల ద్వారా క్షుణ్ణంగా తిరిగి పరీక్షలు చేయటం జరిగింది. ప్రోత్సాహకరంగా ఫలితాలు కనిపించాయి. మరే ఇతర భాగంలోనూ వ్యాధి ఉన్నట్లు రుజువు కాలేదు. కానీ, గుండె కవాటాలు, ఇరుకైన బృహద్ధమనితో సమస్యలు ఉన్నందున, ఈ కేసు ప్రమాదకరంగా పరిగణించబడింది. AOI మంగళగిరిలోని అంకితమైన వైద్య బృందం రోగి యొక్క పరిస్థితిని నిశితంగా పరిశీలించి, శస్త్రచికిత్సకు ముందు విస్తృతమైన రీతిలో పరీక్షలు నిర్వహించింది.
 
డాక్టర్ కళ్యాణ్ పోలవరపు మాట్లాడుతూ "ఈ విజయగాథ AOI మంగళగిరిలోని మొత్తం వైద్య బృందం యొక్క సహకార ప్రయత్నం. ఈ రోగికి ఇన్వాసివ్ సర్జికల్ టెక్నిక్‌లను ఉపయోగించడం వల్ల త్వరగా కోలుకోవడం జరిగింది, ఇది శస్త్రచికిత్స సమయంలో అతి తక్కువగా రక్త నష్టం కావటంతో పాటుగా శస్త్రచికిత్స తర్వాత నొప్పిని సైతం తగ్గిస్తుంది. శస్త్రచికిత్స అనంతర రోజు నుండి ప్రోత్సాహక రీతిలో స్పిరోమెట్రీ నిర్వహించగల సామర్థ్యం ఫలితంగా మిగిలిన ఎడమ ఊపిరితిత్తి యొక్క సరైన విస్తరణ జరిగి, శస్త్రచికిత్స అనంతర ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించింది" అని అన్నారు. 
 
పలు పరిశీలనల తర్వాత, శ్రీ గుణశేఖర్ సాధారణ అనస్థీషియా కింద ఎడమ ఊపిరితిత్తుల దిగువ లోబెక్టమీకి VATS (వీడియో-అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ) చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతర రికవరీ అనూహ్యంగా, సాఫీగా సాగింది, శస్త్రచికిత్స అనంతర 5వ రోజున ఇంటర్‌కోస్టల్ డ్రెయిన్(ICD)ని తొలగించడం, శస్త్రచికిత్స తర్వాత 8వ రోజున డిశ్చార్జ్ చేయడం జరిగింది.
 
AOI యొక్క రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(RCOO) శ్రీ  మహేందర్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "అత్యంత సవాలుతో కూడిన సందర్భాలలో కూడా ఖచ్చితమైన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో AOI స్థిరంగా తన నిబద్ధత చాటుతుంది. ఈ విజయవంతమైన ఫలితం ఆవిష్కరణ మరియు ఆంకోలాజికల్ కేర్‌లో శ్రేష్ఠత పట్ల మా అంకితభావాన్ని నొక్కి చెబుతుంది" అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments