Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింటర్‌లో వెయిట్ లాస్.. కివీ పండ్లు తింటే చాలు..

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (17:29 IST)
శీతాకాలంలో ఆహారం అంత సులభంగా జీర్ణం కాదు. అలాంటి సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి. ఇంకా వింటర్‌లో తీసుకునే ఆహారంలో బరువు పెరిగిపోయే ప్రమాదం వుంది. అందుచేత లైట్ ఫుడ్‌ను తీసుకుంటూ.. బరువును నియంత్రించుకోవచ్చునని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.
 
అంతేగాకుండా వింటర్ ఫుడ్‌లో బరువు తగ్గాలంటే.. బొజ్జను కరిగించుకోవాలంటే.. ఈ ఐదు రకాల పండ్లను తీసుకోవాలి. ఈ ఐదు రకాల పండ్లను తీసుకుంటే జిమ్‌కెళ్లి వర్కౌట్ చేయకుండానే బరువు సులభంగా తగ్గొచ్చు. ఆ పండ్లు ఏమిటో ఓసారి చూద్దాం.. 
 
బరువు తగ్గాలంటే... ముఖ్యంగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా పొట్ట తగ్గుతుంది. ఇంకా సీజనల్ ఫుడ్స్ తీసుకుంటే.. బరువును నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా వింటర్‌లో దొరికే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరడంతో పాటు బొజ్జ తగ్గుతుంది. ద్రాక్షలు, నారింజ పండును తీసుకుంటే బొజ్జను తగ్గించుకోవచ్చు. 
 
రక్తపోటును నియంత్రించుకోవచ్చు. వీటిల్లోని లో-కెలోరీలు బరువు తగ్గిస్తాయి. ఇంకా ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్లు ఒబిసిటీని దరిచేరనివ్వవు. అలాగే దానిమ్మ గింజలను రోజుకు రెండు కప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూర్చినవారవుతారు. 
 
ఈ పండు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది. ముఖ్యం పొట్టను పెరగనివ్వదు. దానిమ్మ గింజలను తీసుకోవడం ద్వారా జిమ్‌కు వెళ్లకుండా.. వర్కౌట్స్ చేయకుండానే బరువు తగ్గవచ్చునని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 
 
ఇక కివీస్ పండ్లు.. ఇవి వింటర్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్. వీటిల్లో విటమిన్లు పుష్కలంగా వుంటాయి. విటమిన్ సి, ఈ, ఫోలేట్, డైయటరీ ఫైబర్ వుంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించి.. బరువును తగ్గిస్తాయి. అలాగే అరటి పండ్లు కూడా బరువును తగ్గిస్తాయంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. 
 
చాలామంది అరటిపండ్లు తింటే బరువు పెరిగిపోతామనుకుంటారు. అయితే ఇందులో హై-కెలోరీలు, చక్కెర శాతం అధికంగా ఆహారం తీసుకోనివ్వదు. ఇందులోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీయాక్సిడెంట్లు శరీరానికి కావలసిన శక్తినిస్తాయి. ఇంకా అరటి పండ్లు శరీరంలో చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తాయి. బరువును కూడా నిరోధిస్తాయి. 
 
వీటితో పాటు నిమ్మను శీతాకాలంలో మరిచిపోకూడదు. నిమ్మలో బరువును తగ్గించే న్యూట్రీషియన్లున్నాయి. విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీయాక్సిడెంట్లు బరువును నియంత్రిస్తాయి. గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి రోజూ పరగడుపున తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments