Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలిని చంపేసే మల్టీవిటమిన్ మాత్రలు

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:10 IST)
సరైన ఆహార నియమాలను అనుసరించి వ్యాయామం చేస్తూ ఉండటం ద్వారా అధిక బరువు తగ్గించుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన మార్గం కూడా. అయితే తీరిక లేని వారు లేదా బద్దకస్తులు ఇవి పాటించకుండా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగా రసాయనిక మందులు తీసుకుంటారు. ఇది చాలా హానికరం. అనేక దుష్ప్రభావాలు కూడా తలెత్తుతాయి. బరువు తగ్గించే మాత్రలను వాడటం వలన కలిగే సాధారణ సమస్య జీర్ణాశయ సమస్య. 
 
ఈ మాత్రలలో ఉండే ఫ్యాట్ బ్లాకర్స్ అజీర్ణం, గ్యాస్, విరేచనలు కలిగిస్తాయి. వీటిలోని కాంబినేషన్‌ల వల్ల శరీరం విటమిన్‌లను గ్రహించే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా విటమిన్‌ల లోపం కూడా కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గించే మాత్రలను వాడే వారు మల్టీవిటమిన్ మాత్రలను కూడా వాడాల్సి వస్తుంది. ఈ మాత్రలలోని సిబుట్రమైన్ అనే సమ్మేళనం ఆకలిని చంపేస్తుంది. 
 
అంతేకాకుండా, హృదయ స్పందన రేటును అసాధారణంగా పెంచి, సరైన సమయానికి చికిత్స అందించకపోతే గుండెపోటుకు కారణం కూడా అవుతుంది. మానసిక రుగ్మతలను కూడా కలిగిస్తుంది. హైబీపీ, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కూడా ఇందు మూలంగా కలుగుతాయి. రక్త పీడనం పెరగడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. పెరిగిన మూత్రనాళం మరియు తైల మలం వంటి సమస్యలు బరువు తగ్గించే మాత్రల వాడకం వలన కలుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. తలనొప్పి, కడుపు నొప్పి, నోరు మరియు గొంతు పొడిగా మారటం, మలబద్దకం ఇవి మరికొన్ని దుష్ప్రభావాలు. 

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments