Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్ ఎండలు... శరీరం వేడిబారినపడకుండా ఉండాలంటే..

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (12:20 IST)
సాధారణంగా వేసవి కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మసాలా ఆహారం, అధిక శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్ వంటి చల్లని పదార్థాలను ఆరగించడం వల్ల శరీరం వేడిబారినపడకుండా ఉంటుంది. అలాగే, సీజనల్ పండ్లను అధికంగా సేవించారు. జ్యూస్‌లు, మంచినీళ్లు సేవిస్తూ ఉండాలి. 
 
వేసవి అంటేనే గుర్తుకొచ్చేది పుచ్చకాయ. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ తీపిపండులో అత్యధిక శాతం నీరు ఉంటుంది. ఈ పండు తినటం వల్ల బరువు తగ్గుతారు. చర్మం మృదువుగా తయారవుతుంది. శరీరంలోని వేడి ఇట్లే తగ్గిపోతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
 
అదేవిధంగా, వేసవిలో రారాజు మామిడికాయనే. వీటిలో ఏ, సీ విటమిన్స్ ఉంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిలో ఐరన్, కాల్షియం ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించటంతో పాటు ఎముకలు గట్టిగా ఉంటాయి.
 
కూల్ డ్రింక్స్ కంటే అధికంగా ఉపశమనాన్ని ఇచ్చేది కొబ్బరి నీళ్లు. పౌషకాల గని. వీటిలోని ఎలక్ట్రోలైట్స్ మంచి హైడ్రేట్స్ ఏజెంట్స్ పని చేస్తాయి. వేడిని తగ్గించటంతో పాటు జీర్ణప్రక్రియకు మేలు చేస్తాయివి. ముఖ్యంగా కొబ్బరినీళ్లు తాగితే రిఫ్రెషింగ్ ఉంటుంది.
 
అన్నింటికంటే తక్కువ ధరలో దొరికేది నిమ్మకాయరసమే, నిమ్మరసంలో కాస్త ఉప్పు లేదా చక్కెర కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గిపోయి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అందరికీ అందుబాటులో ఉండే పండిది.
 
వేసవిలో మోసంబి పండు తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకుపోతాయి. విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధకశక్తిని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ పుష్కలం ఈ పండులో కాబట్టి వడదెబ్బ తగిలిన వారికి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments