Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము నాజూగ్గా మారాలంటే.. పాప్‌కార్న్ తినాల్సిందే..

నడుము నాజూగ్గా మారాలంటే.. పాప్‌కార్న్ తినాల్సిందేనని న్యూట్రీషియన్లు అంటున్నారు. పాప్‌‌కార్న్‌లో ఎక్కువగా పీచుపదార్థాలు, యాంటీ యాక్సిడెంట్లు వుంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో లభిస్తాయి. పైగా వ

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (13:08 IST)
నడుము నాజూగ్గా మారాలంటే.. పాప్‌కార్న్ తినాల్సిందేనని న్యూట్రీషియన్లు అంటున్నారు. పాప్‌‌కార్న్‌లో ఎక్కువగా పీచుపదార్థాలు, యాంటీ యాక్సిడెంట్లు వుంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో లభిస్తాయి. పైగా వీటిని ఎక్కువ రోజులు నిల్వ వుండేలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అందుకే వీటిని ప్యాక్ చేసుకుని ఆఫీసులకు, కాలేజీలకు పట్టుకెళ్లవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
పాప్‌కార్న్‌లో ఫైబర్ అధికంగా వుంది. మిగిలిన తృణధాన్యాలతో పోల్చితే పాప్‌కార్న్‌లో ఫైబర్ శాతం అధికంగా వుంటుంది. ఇంకా పాప్‌కార్న్ నూనెలో వేపకపోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంకా పాప్ కార్న్ క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. పాలిఫెనాల్స్ పాప్‌కార్న్‌లో అధికంగా వుండటం ద్వారా పాప్ కార్న్‌ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. 
 
పాప్‌కార్న్‌లో కెలోరీల శాతం తక్కువ. అయితే థియేటర్లలో దొరికే చీస్, బటర్ పాప్‌కార్న్‌ను అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఇంట్లోనే తయారు చేసే పాప్‌కార్న్ ద్వారానే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
పాప్ కార్న్‌తో పాటు పండ్లు, కూరగాయలను స్నాక్స్‌గా తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. ఆకలేస్తే చాలు బేకరీకో, కాఫీషాప్‌కో పరుగెట్టి, అక్కడ పిజానో, బర్గరో తిని ఓ కూల్‌ డ్రింక్‌ తాగేస్తే కడుపు నిండిపోతుంది. కానీ వాటిల్లోని కార్బోహైడ్రేట్‌లూ, షుగర్‌లూ అధిక బరువుని పెంచేస్తాయి. 
 
అలాంటప్పుడు వాటికి బదులుగా ఓ జామకాయనో, యాపిల్‌నో, అరటిపండునో తీసుకుంటే బరువు పెరగరు. శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.  కొలెస్ట్రాల్‌ సమస్యే ఉండదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: బ్రాస్లెట్ కోసం గొడవ: చెంపదెబ్బ భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య.. చివరికి?

KTR: ఒకసారి కాదు, 100 సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా వున్నాను.. కేటీఆర్

టూరిస్ట్ చేతిలో నుంచి నోట్ల కట్టలను లాక్కెళ్లిన కోతి!

ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

తర్వాతి కథనం
Show comments