Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రివేళల్లో పెరుగును తినడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసా?

Webdunia
బుధవారం, 22 మే 2019 (15:50 IST)
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగన్నం లేనిదే భోజనం పూర్తయినట్లు కాదు. అలాంటి పెరుగుని రాత్రుల్లో తినవద్దని, ఇలా తింటే శ్వాససంబంధిత వ్యాధులు వస్తాయని కొందరు చెబుతుంటారు. ఇందులో నిజమెంత ఉందో తెలుసుకుందాం. 
 
పాలు, పెరుగు పదార్థాల్లో క్యాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. అందుకే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పాల పదార్థాలను తీసుకుంటారు. ముఖ్యంగా శాకాహారులకి మిల్క్ ప్రొడెక్ట్స్ చాలా మంచిది. అయితే రాత్రి పూట పెరుగు తీసుకోవడం వల్ల జలుబు చేస్తుందని, శ్వాససంబంధింత మరియు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతుంటారు. 
 
అందులో ఎంత మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి వారైనా రాత్రి పూట పెరుగు తీసుకోవచ్చని, వీటిని తీసుకోవడం వల్ల అదనపు లాభాలు ఉంటాయని, చక్కగా నిద్రపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గడ్డ పెరుగులా కాకుండా కాస్త పలుచగా మజ్జిగలా చేసుకుని తీసుకుంటే ఇంకా మంచిది. 
 
అయితే ఆ పెరుగు మరీ చల్లగా, ఫ్రిజ్‌లో పెట్టింది కాకుండా సాధారణ టెంపరేచర్‌లో ఉండేలా చూసుకోవాలి అప్పుడే మన శరీరానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఏవేవో కారణాలు చెప్పి ఆరోగ్యాన్నిచ్చే పెరుగును వద్దనకండి, హ్యాపీగా తినేయండి అంటూ నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments