Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. 30 ఏళ్లలోనే పలకరిస్తున్న డయాబెటిస్ మహమ్మారి.. మనదేశమే కాపిటల్..!

భారత దేశ ప్రజలకు డయాబెటిస్ మహమ్మారితో బాధలు తప్పట్లేదు. దేశంలో చాలామంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని.. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. సాధారణంగా 50

Webdunia
శుక్రవారం, 22 జులై 2016 (12:37 IST)
భారత దేశ ప్రజలకు డయాబెటిస్ మహమ్మారితో బాధలు తప్పట్లేదు. దేశంలో చాలామంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని.. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. సాధారణంగా 50 ఏళ్లకు పైగా వచ్చే మధుమేహం ప్రస్తుతం 30 వయస్సులోనే పలకరించడంతో.. డయాబెటిస్ మాత్రలు తీసుకునే వారి సంఖ్య దేశంలో అధికమవుతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
అంతేగాకుండా డయాబెటిస్ మహమ్మారి భారత జనాభాతో పాటు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. అంతేగాకుండా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఔషధాల్లో మధుమేహానికి సంబంధించిన మందులదే అగ్రపీఠం కావడం ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది జూన్‌ వరకు దేశంలోని టాప్‌-10 ఔషధాల జాబితాలో ఏకంగా ఐదు యాంటీ-డయాబెటీస్‌కు సంబంధించిన మందుల కంపెనీలు ఉన్నాయని ఏఐవోసీడీ తేల్చింది.
 
నవంబర్ 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం రానుండటంతో దేశంలో డయాబెటిస్ మహమ్మారిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత ఏడాది నిర్వహించిన సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరి డయాబెటిస్ ఉందని.. ఇదే అనేక జబ్బులకు దారి తీస్తుందని వైద్యులు చెప్తున్నారు. 
 
ఇక మన దేశంలో ప్రతీ కుటుంబంలో ఒక్కరైనా డయాబెటిస్‌ బారిన పడిపోతున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా మనదేశమే డయాబెటిస్‌కి కాపిటల్‌‌గా ఉందని పరిశోధనలో తేలింది. సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా డాక్టర్‌తో చెకప్‌ చేయిస్తూ, సూచనలు పాటిస్తే డయాబెటిస్‌ పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments