Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ 300 మిల్లీ లీటర్ల పెరుగును తింటే...?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:25 IST)
పాలలో చేమిరి వేస్తే అదే పెరుగవుతుందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ చేమిరిలో "ల్యాక్టోబేసిల్స్ బల్గేరికస్" అనబడే బ్యాక్టీరియా ఉంటుంది. పాలలో చేమిరి వేయడంతో ఆ పాలు "షుగర్ ల్యాక్టిక్ యాసిడ్‌"లోకి మారిపోతుంది. దీంతో పాలు పేరుకుని పెరుగుగా రూపాంతరం చెందుతుంది. పాలకన్నా పెరుగును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. 
 
తెల్ల రక్త కణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. వయసు పెరిగే కొద్దీ మనిషి పెరుగును తీసుకుంటుండాలి. దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే చాలాకాలంగా పలు జబ్బులతో బాధపడేవారు తప్పనిసరిగా పెరుగును తీసుకోవాలి. పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీ బయోటిక్ థెరపీ ఇచ్చే సందర్భంలో నియమానుసారం పెరుగు తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.  
 
ప్రతిరోజూ 300 మిల్లీ లీటర్ల పెరుగును తింటే ఆస్టియోపొరోసిస్, క్యాన్సర్ ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. ప్రతిరోజూ ఆహారంతోపాటు పెరుగు తీసుకోవడం వలన శరీర వేడిని తగ్గిస్తుంది. జబ్బులను తరిమికొట్టే పెరుగు ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఉరుకులు-పరుగులమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో ఉదర సంబంధిత జబ్బులతో బాధపడుతుండడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి వారు తాము తీసుకునే ఆహారంలో పెరుగును తగినంత మోతాదులో తీసుకుంటుంటే ఎలాంటి జబ్బులు దరిచేరవంటున్నారు డైటీషియన్లు. 
 
భోజనం ద్వారా తీసుకునే విటమిన్లు, ఖనిజాలు సరిగా జీర్ణం కావు. ఇలాంటి సమయంలో పెరుగు తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగు తీసుకోవడం వలన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. దీంతో ఉదరంలో తలెత్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చను. పెరుగు తీసుకోవడం వలన శరీరానికి అందవలసిన పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతోపాటు శరీర చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 
 
కొందరికి తరచూ నోట్లో పుండు ఏర్పడడం లేదా పొక్కులు ఏర్పడడం జరుగుతుంటాయి. ఇలాంటి వారు ప్రతిరోజూ రెండు నుండి నాలుగుసార్లు నోట్లో పుండున్న చోట పెరుగు పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. పెరుగు తీసుకోవడం వలన రక్తంలో ఏర్పడే ఇన్ఫెక్షన్‌ను అదుపులో ఉంచేందుకు తెల్ల రక్త కణాలు ఎంతగానో తోడ్పడుతాయి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments