Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేలమీద కూర్చుని భోజనం చేస్తే ఏమవుతుంది..?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (10:17 IST)
ప్రస్తుతం చాలామంది డైనింగ్ టేబుల్‌పై భోజనం చేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యరీత్యా సరైనా విధానం కాదని వైద్యులు చెబుతుంటారు. పాతకాలంలో నేలమీద కూర్చుని భోజనం చేసే సంప్రదాయం ఉండేది. ఇలా చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. నేలపై కూర్చుని భోజనం చేసే సమయంలో మనం సుఖాసనంలో కూర్చోవలసి వస్తుంది.
 
సుఖాసనం అనేది పద్మాసనం లాంటిదే. పద్మాసనం కారణంగా శరీరానికి ఏ ప్రయోజనాలు చేకూరుతాయో, సుఖాసనంలో కూడా అవే ప్రయోజనాలుంటాయి. కూర్చుని తినడం వలన ఆహారాన్ని చక్కగా స్వీకరించగలుగుతాం. ఈ ఆసనం ఏకాగ్రతను కూడా ప్రసాదిస్తుంది. 
 
రక్తప్రసరణ దేహమంతటా సమాన రీతిలో ఉండేలా చేస్తుంది. తద్వారా శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. ఈ విధంగా భోజనం చేయడం వలన అధిక బరువు, మలబద్ధకం, గ్యాస్ తదితర ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. ఈ ఆసనంలో కూర్చోవడం వలన నడుమునొప్పి నుండి విముక్తి లభిస్తుంది. 
 
కనుక ప్రతిరోజూ చేసే భోజనం ఒంటికి పట్టాలంటే.. నేలమీద కూర్చుని తినండి. అదే ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్యులు. ఇలా నేలమీద కూర్చుని తినడం వలన జీర్ణక్రియలు కూడా సక్రమంగా జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments