Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ఎక్కడ ఎంతసేపు జీవిస్తుందో తెలుసా?

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (13:30 IST)
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ గురించే చర్చిస్తోంది. ఈ మహమ్మారి ఇప్పటికే 195 దేశాలను కమ్మేసింది. దాదాపుగా ఎనిమిది లక్షల మందికి ఈ వైరస్ సోకగా, 27 వేల మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ మరణాలు భారత్‌లో కూడా ఉన్నాయి. అలాంటి ఈ మహమ్మారి వైరస్‌ను అంతమొందించేందుకు ఇప్పటివరకు ఒక్క దేశం కూడా విరుగుడు మందును కనిపెట్టలేకపోతోంది. అన్ని ప్రయోగశాలలు కరోనా వైరస్ విరుగుడు మందును కనిపెట్టే పనిలో తలమునకలై ఉన్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో అసలు ఈ వైరస్ ఎక్కడ ఎంత జీవిస్తుందనే అంశంపై వైద్యులు స్పందిస్తూ, కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరల్లో ఉండే వైరస్‌ కణాలు గాలిలో మూడు గంటల పాటు బతికి ఉంటాయి. 
 
ప్లాస్టిక్‌, స్టీల్‌, బెంచ్‌ ఉపరిలం, గాజు, స్టీలు వస్తువులపై 72 గంటల పాటు వైరస్‌ జీవించి ఉంటుంది. కార్డుబోర్డు, కాగితం, ఫ్యాబ్రిక్స్‌పై 24 గంటల పాటు చురుగ్గా పనిచేస్తుంది. 
 
అయితే సమయం గడిచే కొద్దీ వైరస్‌ ప్రభావం తగ్గిపోతుంది. కానీ ఈ లోపు మనం సదరు వస్తువులను తాకినట్లయితే మనలోకి వైరస్‌ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా ఆ వైరస్ జీవితకాలం పెరుగుతూపోతుంది. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments