వేసవిలో మెంతుల పొడిని తీసుకుంటే ఎంత మేలు జరుగుతుందంటే?

మెంతులు వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో వేడిమిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చూచిస్తున్నారు. మెంతుల్లో 50 శాతం పీచుపదార్థం ఉండడం వలన చక్కెర వ్యాధికి, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించు

Webdunia
మంగళవారం, 29 మే 2018 (10:27 IST)
మెంతులు వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో వేడిమిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతుల్లో 50 శాతం పీచుపదార్థం ఉండడం వలన చక్కెర వ్యాధికి, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు సహాయపడుతుంది. మెంతులు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఇలాంటి వ్యాధులనుండి దూరంగా ఉండవచ్చును.
 
మెంతుల్ని తీసుకోవడంతో పాటు రోజూ అరగంట వాకింగ్ చేస్తే బరువు తగ్గుటకు ఉపయోగపడుతుంది. శరీరానికి గల ఉదరసంబంధిత రుగ్మతలు ఏర్పడకుండా మెంతులు సహాయపడుతాయి. ఈ మెంతులకు పొడి చేసుకుని నీటిలో లేదా మజ్జిగలో కలుపుకుని భోజనానికి 15 నిమిషాల ముందు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. షురగ్ లెవన్‌ను కంట్రోల్ చేస్తుంది. అలాకాకుంటే వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని డ్రైన్డ్ చేసి ఆ మిశ్రమాన్ని చపాతీ, ఇడ్లీ, పొంగల్, పెరుగు, ఉప్మా వీటినన్నింటిలో వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
తల్లులకు పాల ఉత్పత్తిని పెంచేందకు మెంతులు చాలా ఉపయోగపడుతాయి. దీనిని ఎలా తీసుకోవాలంటే, మెంతులకు నెయ్యిలో వెయించి వాటిని బాగా నూరి ఆ చూర్ణానికి సమానంగా గోధుమ పిండిని కలిపి ఆ మిశ్రమంలో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అలాలేకుంటే మెంతులతో చేసిని కషాయాన్ని, మెంతికూర పప్పును తీసుకుంటే కూడా మంచిది.
 
ఈ మెంతులను రోజు ఆహారంలో తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగి జీర్ణక్రియకు సహాయపడుతాయి. మలబద్దకం తొలగిపోతుంది. నిమ్మరసంలో మెంతుల పొడిని కలిపి తీసుకుంటే జ్వరం నుంచి విముక్తి చెందవచ్చును. గాయాలకు, పుండ్లకు, తామర, గజ్జి, ఎండవలన కందిపోయి చర్మం వంటి సమస్యలకు మెంతుల పొడిని తీసుకుంటే మంచిది. ఆ మెంతుల పొడిలో కొంచెం నీళ్లుపోసి పేస్ట్‌లా తయారుచేసుకుని మీ చర్మానికి రాసుకుంటే పైన తెలిపిన సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్, 10,000 మంది విద్యార్థులు

బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో కాలుష్య స్థాయిలు ఎక్కువ

Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని.. చంద్రబాబు క్లారిటీ

కుప్పంలో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన- రూ.675 కోట్ల పెట్టుబడులు

అమరావతిలో క్యాంటీ వ్యాలీ వుందని చెప్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా తో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి : సౌందర్య రజనీకాంత్

Devagudi Review: వాస్తవ ఘటన ఆధారంగా రాయలసీమ ప్రేమకథ దేవగుడి - మూవీ రివ్యూ

రాజమౌళి - మహేశ్ బాబు సినిమా రిలీజ్ డేట్ ఖరారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్

అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి

తర్వాతి కథనం
Show comments