పట్టరాని కోపంతో ఊగిపోతుంటారు, ఆ కోపం ఏం చేస్తుందో తెలుసా?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (23:00 IST)
పట్టరాని కోపంతో చాలామంది ఊగిపోతుంటారు. ఇలాంటి కోపం వల్ల దీర్ఘకాలిక శారీరక ప్రభావాలు పెరిగిన ఆందోళన, అధిక రక్తపోటు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కోపాన్ని సరిగ్గా వ్యక్తీకరించినట్లయితే, అది సానుకూల, ఉపయోగకరమైన భావోద్వేగం వుండి పోతుంది కాని ఆరోగ్య సమస్యలను తీసుకురాదు. కోపం అదుపు చేసుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహాలలో క్రమమైన వ్యాయామం, విశ్రాంతి పద్ధతులు నేర్చుకోవడంతో పాటు కౌన్సెలింగ్ పద్ధతులు ఉన్నాయి.

 
కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితానికి చెడుపు చేస్తాయి. అర్థపర్థం లేని కోపాన్ని అవతలి వ్యక్తిపై ప్రదర్శించడం వల్ల సంబంధాలు తెగిపోతాయి. ఇంకా ఈ కోపం ఎన్నో.. ఎన్నెన్నో రకాలు వస్తుంటుంది. మనం కోరుకున్నది దొరక్కపోవడం. ఇష్టమైనది జరగకపోవడం, ఇష్టం లేనిది జరగటం, మాటకు మాట అందివ్వడం, చెప్పిన మాటలను ధిక్కరించడం.. అంచనాలు తప్పిపోవడం.. 

 
ఇలా ఒకటేమిటి.. కోప కారణాలు సవాలక్ష. అయితే కోపం రావడానికి గల కారణాలను అన్వేషించకుంటే మనకు కోపం తెప్పించిన పరిస్థితులను గురించి కూడా ఆలోచిస్తే మనం చిరాకు పరాకులను, మాట దూకుడుతనాన్ని కాస్తంతయినా అదుపులో ఉంచుకోవచ్చు.

 
కోపం వస్తే ఏమవుతుంది?
కొందరు కోపం వస్తే తమలో తాము బాధపడిపోయి గింజుకుంటారు. ఇంకా తగ్గకపోతే భోజనం మాని తమను తాము హింసించుకుంటారు. అయితే ఇలాంటి ప్రవర్తన వల్ల మీ కోపం వచ్చిందన్న సంగతి ఇతరులకు అర్థం కాకపోగా, కుటుంబీకులు బంధువులు, మిత్రులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. 

 
ఒకవేళ అర్థమైనా మీ వైఖరికి అలవాటు పడిపోయి సరేలెమ్మని వదిలేస్తారు. ఇది మీకు మరింత ప్రమాదకరం అవుతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు దానికి కారకులైన వారి వద్దకు పోయి, మీ బాధను మీ ఆగ్రహాన్ని బయటపెట్టి అడిగేస్తే సగం బాధ తీరిపోతుంది. వారి సమాధానం మీ అంచనాకు భిన్నంగా ఉంటే... మీ కోప కారణమే తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. 

 
అలాగని కోపం వచ్చినప్పుడు కోపం తెప్పించిన వారితో మాట్లాడకుండా, చూడకుండా ఉంటే కాసేపటికి కోపం పోతుంది. అలాకాక, కోపం తెప్పించిన వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడితే మరికొన్నిసమస్యలు ఎదురవుతాయి. అందుకే కోపంతో ఉన్నప్పుడు దాని గురించి పరాయి వారి దగ్గర మాట్లాడే కన్నా మౌనంగా ఉంటే ఎంతో మంచిది.

 
కోపానికి పరిష్కారం ఏంటి?
కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం. ఒక్కోసారి కోపంలో ఏం మాట్లాడుతున్నామో మనకే అర్ధం కాదు. అందుకే కోపం వచ్చినప్పుడు ప్రతి మాటకు ముందు రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి.

 
కోపానికి అతిసులువైన విరుగుడు అంకెలను లెక్కపెట్టడమే. కోపం వస్తే ధీర్ఘంగా శ్వాసిస్తూ ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెడితే క్రమంగా కోపం తగ్గిపోతుంది. ఆత్మన్యూనత భావం కలవారు ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటారు. ఇందువల్ల ఏ ప్రయోజనం లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు పరిష్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే.

 
కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా మనుషులకు పిలువకుండానే కోపం వస్తుంది. ముఖ్యంగా ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కోపిష్టులపై సానుభూతి చూపి మంచి మాటలతో ఊరడించాలి. ఈ సారి ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. అద్దంలో మొహం చూసుకోండి. కోపంలో మీ హావభావాలు ఎంత వికృతంగా ఉంటాయంటే.. వాటిని అద్దంలో చూస్తేచాలు... మరోసారి మీకు కోపం రమ్మన్నా రాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

తర్వాతి కథనం
Show comments