Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగువను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

ఇంగువను వేడిచేసి పుచ్చి పంటిలో ఉంచితే ఉపశమనం కలుగుతుంది. తేనెలో కొద్దిగా ఇంగువను కలుపుకుని పిల్లల్లకు నాకిస్తే కడుపు ఉబ్బరం సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. అరగ్రాము ఇంగువను ఆవు నెయ్యిలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. 10 గ్రాముల

Webdunia
గురువారం, 19 జులై 2018 (11:57 IST)
ఇంగువను వేడిచేసి పుచ్చి పంటిలో ఉంచితే ఉపశమనం కలుగుతుంది. తేనెలో కొద్దిగా ఇంగువను కలుపుకుని పిల్లల్లకు నాకిస్తే కడుపు ఉబ్బరం సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. అరగ్రాము ఇంగువను ఆవు నెయ్యిలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. 10 గ్రాముల హారతి కర్పూరంలో 10 గ్రాముల ఇంగువను వేసి వేడినీటిలో కలుపుకుని తీసుకుంటే ఉబ్బసం నుండి ఉపశమనం లభిస్తుంది.
 
ఇంగువను నీళ్లల్లో కరిగించి ముక్కులో 3 చుక్కలు వేసుకుని నస్యంగా పీలిస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది. ఇంగువ, సైందవ లవణం, శొంఠి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకుని 30 గ్రాముల ఆవనూనెలో కలుపుకోవాలి. చెవినొప్పితో బాధపడేవారు ఈ నూనెను వేసుకుంటే చెవిపోటు తగ్గిపోతుంది. ఇంగువను మంచినీళ్లలో అరగదీసి ఆ గంధాన్ని కాలిన చోటు లేపనంగా వేస్తే కాలిన గాయలు, బొబ్బలు మానిపోతాయి. 
 
పుచ్చుపళ్లతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు కాస్త ఇంగువను ఆ పంటిపై ఉంచితే అందులో ఉన్న క్రిములు మటుమాయమవుతాయి. శరీరంలో ఎక్కడైనా ముల్లు గుచ్చుకుని అందులోనే ఉంటే ఆ ప్రాంతంలో ఇంగువ ద్రావకం పోయాలి. కాసేపటి తరవాత అది దానంతట అదే బయటికి వచ్చేస్తుంది.
 
ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. ఊపిరితిత్తులు, ఉదర సంబంధమైన వ్యాధులకు ఇంగువ మంచి ఔషధం. మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ఇంగువ చూర్ణం తీసుకోవాలి. కడుపులో పురుగులు ఉంటే ఇంగువను నీళ్లలో కలిపి తీసుకోవాలి. రోజూ భోజనంలో ఇంగువ ఉండేలా చూసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నరాలను ఉత్తేజపరుస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments