Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారంలో ఆ ఐదు తప్పకుండా వుండాలట.. (video)

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (12:30 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే అందుకు ఎలాంటి పద్ధతులను పాటించాలన్నదే ముఖ్యం. చాలామంది ఉదయం వేళ హడావుడిగా తినేశాం అనిపిస్తుంటారు కానీ అల్పాహారంలో ముఖ్యంగా ఐదింటిని భాగం చేసుకోవాలి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 
 
రోజూ మనం తీసుకునే ఆహారంలో అల్పాహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అల్పాహారానికి బ్రేక్ ఇవ్వడం, ఫాస్టింగ్‌ అంటూ వదిలిపెట్టేయడం చేయకూడదు. అలాచేస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే అల్పాహారాన్ని తప్పకుండా తీసుకోవాలని.. తీసుకునే ఆహారంలో అధిక ప్రోటీన్లు వుండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. అందుకే అల్పాహారంలో అధిక ప్రోటీన్లు వున్న ఆహారాన్ని తీసుకోవాలి.
 
అల్పాహారంలో అధిక ప్రోటీన్లు వుంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు సరిగ్గా వుంటాయి. తద్వారా మధుమేహం చెంతకు చేరదు. ఇంకా బరువు సులభంగా బరువు తగ్గుతారు. శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. ఒబిసిటీకి చోటే వుండదు. అందుచేత అధిక ప్రోటీన్లు కలిగిన కోడిగుడ్లు, ఓట్స్, నట్స్, పాలు, పండ్లు అల్పాహారంలో తప్పక వుండేలా చూసుకోవాలి. 
 
ముందుగా కోడిగుడ్లు- రోజూ అల్పాహారంలో కోడిగుడ్డును తీసుకుంటే శరీరానికి సరిపడా శక్తి లభిస్తుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. ఇందులో ఫ్యాట్ సాల్యూబల్ విటమిన్స్ వుంటాయి. తద్వారా బరువు తగ్గొచ్చు. అందుకే ఉదయం పూట ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ దోసె వంటివి అల్పాహారంగా తీసుకోవాలి.
 
అలాగే ఓట్స్ - ఓట్స్‌లో హై ప్రోటీన్లు లేకపోయినా.. ఓట్స్‌లో ఫైబర్ రిచ్‌గా వుంటుంది. ఫైబర్‌ ఎక్కువగా వుండే వోట్స్‌ను అల్పాహారంగా తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగ్గా వుంటుంది. ఇది అధికంగా ఆహారం తీసుకోనీయదు. తీసుకున్న ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. వోట్స్‌ను తీసుకుంటే కడుపు నిండినట్లుంది. 
 
ఇకపోతే.. నట్స్ సంగతికి వస్తే బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ ఉదయం పూట తప్పక తీసుకోవాలి. ఇందులోని ప్రోటీన్లు, ఓమెగా-త్రీ ఫ్యాటీ యాసిడ్స్.. గుండెను, మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. రోజుకు గుప్పెడు.. అదీ అల్పాహారంలో నట్స్‌ను తీసుకుంటే.. బరువు ఏమాత్రం పెరగరు. 
 
అదేవిధంగా పాలు.. పాలను రోజూ అల్పాహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. ఇందులోని విటమిన్ బీ3.. బరువును నియంత్రిస్తుంది. తాజాగా నిర్వహించిన కొన్ని పరిశోధనల్లో పాలను తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చునని తేలింది. 
 
పండ్లు- రోజూ అల్పాహారంలో పండ్లను చేర్చుకోవడం ద్వారా బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చు. బరువు పెరగడం ద్వారా మధుమేహం లాంటి రుగ్మతలు వెన్నంటి వస్తాయి. ఫలితంగా జామకాయలు, అవకోడా, ఆప్రికాట్స్, కివి ఫ్రూట్స్, అరటి పండ్లతో సలాడ్‌లా అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. కాబట్టి ఈ పదార్థాలను అల్పాహారంలో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments