Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్యాక్ చేసిన పెరుగు.. వేరుశెనగలు తింటే బరువు పెరిగిపోతారు.. తెలుసా?

ప్యాక్ చేసిన పెరుగు.. వేరుశెనగలు తింటే బరువు పెరిగిపోతారు.. తెలుసా?
, గురువారం, 6 డిశెంబరు 2018 (13:10 IST)
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడంలో తప్పు లేదు కానీ.. ప్రోటీన్లు పుష్కలంగా వుండే ఆహార పదార్థాలను అదే పనిగా తీసుకుంటే మాత్రం.. బరువు పెరిగిపోయే ప్రమాదం వుందని న్యూట్రీషియన్లు హెచ్చరిస్తున్నారు.


ప్రోటీన్లు పుష్కలంగా వుండే ఆహారాన్ని తరచూ తీసుకోవడం ద్వారా వాటిలోని చక్కెర స్థాయిలు శరీరంలోకి చేరుతాయి. తద్వారా సులభంగా బరువు పెరిగిపోతుందట. అందుకే అలాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన పెరుగును తీసుకోవడం మంచిది. అంతేకానీ.. ప్యాక్ చేసి షాపుల్లో అమ్మే పెరుగును వాడటం ద్వారా అందులో హై-ప్రోటీన్లు బరువును పెంచేస్తాయి. రోజూ ప్యాక్ చేసిన పెరుగును తింటే మాత్రం ఒబిసిటీ ఖాయం. ఇందులోని కృత్రిమమైన ఫ్లేవర్స్, చక్కెర స్థాయిలు బరువును పెంచేస్తాయని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 
 
అలాగే వర్కౌట్స్ తర్వాత తీసుకునే ప్రోటీన్లు గల బార్స్, ప్రోటీన్ షేక్స్‌ను పక్కనబెట్టేయాలి. అలాగే ప్రోసెస్ చేసిన చీజ్‌ను వాడకపోవడం మంచిది. సాధారణంగా చీజ్‌లో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. దీన్ని తరచూ తీసుకుంటే బరువు పెరుగుతారు. ఇకపోతే.. వేరు శెనగలను మాత్రం మితంగా తీసుకోకపోతే.. బరువు పెరగడంలో ఏ మార్పు లేదంటున్నారు.. పోషకాహార నిపుణులు. 
 
వందగ్రాముల వేరుశెనగల్లో 26గ్రాముల ప్రోటీన్లు వుంటాయి. అంతేకాకుండా.. హై ఫ్యాట్స్, కేలరీస్ మస్తుగా వుంటాయి. అందుకే వీటిని మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ పరగడుపున ఓ స్పూన్ నువ్వులు - బెల్లం తింటే...