Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాప్యంలో ఎంచక్కా చేపలు తినొచ్చు... లేకుంటే?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (15:43 IST)
అవును. వృద్ధాప్యంలో చాలామంది మాంసాహారాన్ని పక్కనబెట్టేయడం చేస్తుంటారు. అయితే మాంసాహారంలో భాగమైన సీఫుడ్ లిస్టులో వున్న చేపలను మాత్రం వృద్ధాప్యంలో తప్పకుండా తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. మటన్, చికెన్‌ను పక్కనబెట్టేసినా పర్లేదు కానీ.. చేపలను మాత్రం తీసుకోకుండా వుండకూడదని వారు సూచిస్తున్నారు. 
 
వృద్ధాప్యంలో గుండె జబ్బులు, నొప్పులు, అధిక రక్తపోటు వంటి రుగ్మతలు ఎదుర్కోవాల్సి వుంటుంది. వీటికి మందులు తీసుకోవడమే కాకుండా ఆహారంలో రోజుకు పావు కప్పైనా చేపలు తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా వుండే ఈ చేపలను తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. 
 
హైబీపీని పక్కనబెట్టేయవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్రపు చేపల్లో పోషకాలు పుష్కలంగా వుంటాయి. చేపల్లో మాంసకృత్తులు, విటమిన్‌ ఎ, విటమిన్‌ డి, ఫాస్ఫరస్‌ వంటివి పుష్కలంగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు అవసరమయ్యే ఫ్లోరిన్‌తో పాటు.. రక్తవృద్ధికి అవసరమయ్యే హీమోగ్లోబిన్‌ పెరగడానికి, అందుకు కావాల్సిన ఇనుము చేపల్లో విరివిగా లభిస్తుంది.
 
అలాగే బానపొట్ట రాకుండా ఉండాలంటే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తినడం మంచిది. అందుకే వయోబేధం లేకుండా చేపలు తీసుకోవచ్చునని.. తద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments