Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడప్పుడు ఆఫీసుకు లీవ్ పెట్టేస్తున్నారా?

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (15:17 IST)
రోజంతా అలసటగా ఉందా? అనారోగ్య సమస్యలతో అప్పుడప్పుడు ఆఫీసుకు లీవ్ పెట్టేస్తున్నారా? ఎక్కువగా పనిచేయకపోయినా అలసట ఆవహిస్తుందో.. ఆరోగ్యంపై తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు నిపుణులు. శరీరంలో బ్లడ్ ప్రెజర్ తక్కువగా ఉన్నా.. ఎనర్జీ లేకపోయినా అలసట తప్పదు.
 
ఇంకా రోజంతా అలసట, నీరసంగా ఉన్నట్లైతే అది గుండె సంబంధిత రోగాలకు గుర్తని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో తగినంత రక్తప్రసరణ లేకపోవడంతో పాటు శరీరంలోని బ్లడ్‌సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం ద్వారా హృద్రోగ వ్యాధులకు దారి తీస్తుంది. 8 గంటల నిద్రకు తర్వాత చురుగ్గా పనిచేయాలంటే తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారంలోనే రోజంతా పనిచేసేందుకు కావలసిన పోషకాలున్నాయి. అయితే సింపుల్‌‍గా టైమ్ లేదనో ఇతరత్రా కారణాల చేత టిఫిన్ తీసుకోకుండా పోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అందుచేత అల్పాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్‌ తీసుకోవడాన్ని నివారించాలి. రోజుకు అరగంటైనా వ్యాయామం చేయాలి. రోజుకు 8 గంటల పాటు నిద్రపోవాలి. హాలీడేస్ లోనూ ఇదే సమయాన్ని ఫాలో చేయాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. అప్పుడప్పుడు ఉద్వేగానికి లోనుకాకూడదు. ఒత్తిడిని దూరంగా ఉంచాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. విటమిన్ బి12 లోపం ఉంటే అలసట ఆవహిస్తుంది. అందుచేత వారానికి రెండుసార్లు పరిమితంగా మాంసాహారం తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

తర్వాతి కథనం
Show comments