Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవిసె గింజల పొడిని గ్లాసు నీటిలో కలుపుకుని తాగితే?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (12:34 IST)
రాత్రిపూట అధిక సమయం మేల్కొనే వారిలో ఒబిసిటీ సమస్య తప్పదు. సరిపోను నిద్ర లేకపోవడం అనేది కొవ్వును కరిగించే హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఎక్కువగా ఆకలి వేస్తుంది. చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం తినాలనిపిస్తుంది. అలసటకు కూడా కారణమవుతుంది. ఫలితంగా ఒబిసిటీ తప్పదు.
 
ఒబిసిటీ నుంచి బయటపడాలంటే.. అధిక బరువును తగ్గించుకోవాలంటే.. భోజనం చేయడానికి అరగంట లేదా గంట ముందు టీ స్పూను ఫైబర్‌ సప్లిమెంట్‌ పౌడర్‌ లేదా తాజా అవిసె గింజల పొడిని గ్లాసు నీళ్లలో కలుపుకొని తాగండి. దీంతో ఎక్కవ ఆకలి అనిపించదు. తక్కువ ఆహారం తీసుకుంటారు. మానసిక ఒత్తిడి వల్ల బరువు పెరుగుతుంది. అందుచేత ధ్యానం చేయడం, గట్టిగా శ్వాస తీసుకోవడం, కొన్ని నిమిషాలు చేతలు, కాళ్లను మసాజ్‌ చేసుకోవడం వల్ల ఒత్తిడి దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా భోజనం బదులు ప్రొటీన్‌ షేక్‌ తీసుకోవడం వల్ల అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. బాదం పాలలో ప్రొటీన్‌ పౌడర్‌, చక్కెర కలపని కొబ్బరి పాలు, తాజా అవిసె గింజల పొడి, ఆకుపచ్చ ఆకుకూరలు కలిపి తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments