Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరాలు తింటే కిడ్నీల్లో రాళ్లు....

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (23:25 IST)
కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను, ఇన్‌ఫెక్షన్లని దూరం చేస్తుంది. రాత్రి పూట నీటిలో నాలుగు ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. ఖర్జూరంలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
 
అత్యంత తియ్యగా ఉండే ఈ ఖర్జూరంలో గ్లూకోజ్, ప్రక్టోజ్‌లు అధికంగా ఉంటాయి. ఖర్జూరం రోజూ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండెకు సంబందించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది.
 
ఇందులో యాంటీఆక్సీడెంట్ల రూపంలో ఉండే విటమిన్-సి కంటికి చాలా మంచిది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కంటికి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
 
ఖర్జూరాలు ఆరోగ్యకరమైన బరువు పెంచడానికి సహాయపడుతాయి. బాగా సన్నగా ఉన్నవారు రోజూ ఖర్జూరాన్ని తినడం వల్ల సహజంగా బరువు పెరుగుతారు. కాబట్టి రోజువారి ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చుకోవడం మంచిది.
 
ఇవి ఎముకల దృఢత్వానికి బాగా ఉపకరిస్తాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. దంతాలను దృఢపరచడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా జలుబు, గొంతులో శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్దప్రేగులోని సమస్యలను నివారిస్తాయి.

సంబంధిత వార్తలు

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments