Publish Date: Wed, 30 Sep 2020 (21:49 IST)
Updated Date: Thu, 01 Oct 2020 (19:30 IST)
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసాన్ని పిండి తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయంటూ కొన్ని అపోహలు వున్నాయి. ఐతే నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చని నీటిలో పిండి తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిపుణుల సలహా ప్రకారం రోజూ ఈ పానీయం తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో పెద్ద మొత్తంలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఈ పదార్ధం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
డాక్టర్ మార్గదర్శకత్వం ప్రకారం క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటిలో కలిపిన రెండు నిమ్మకాయల రసాన్ని తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు రావు. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీనిలోని పోషకాలు శరీరంలో మూత్రపిండాల రాళ్ల సమస్య పెరగడానికి అనుమతించవు.
నిమ్మరసం మూత్రపిండాల్లో రాళ్లను నిరోధించడంలో సమర్థవంతమైన ఔషధంగా చెప్పబడింది. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా చక్కగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండుకుని తాగవచ్చు.