Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఈ పండ్లు తీసుకుంటే..? ఎండు ద్రాక్షలలో పాలలో మరిగించి? (video)

Webdunia
గురువారం, 21 మే 2020 (15:07 IST)
అసలే వేసవి కాలం. ఎండలు వేడెక్కిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేసవిలో నీటిశాతం ఎక్కువగా వుండే పండ్లను తీసుకోవాలని అందరికీ తెలుసు. అందుకే పుచ్చకాయ, కీరదోస, కొబ్బరిబోండాం వంటివి తీసుకుంటుంటాం. అయితే వీటితో పాటు కొన్ని పండ్లను తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ పండ్లు ఏంటో ఓసారి చూద్దాం.. 
 
అరటిపండ్లు: జీర్ణశక్తికి రోజూ రాత్రి పూట అరటిపండును తీసుకోవడం మంచిది. అరటిలో కొవ్వు పదార్ధం చాలా అల్ప మోతాదులో ఉంటుంది. శరీరంలోని విషపదార్ధాలను ఇది చక్కగా తొలగిస్తుంది. డయేరియాను తగ్గించడంలో అరటి పండ్లు ఎంతగానో సహాయపడతాయి.
 
సపోటా: సపోటా పండు చర్మానికి తేమనిస్తుంది. ఇంకా చర్మంపై వున్న ముడతలను దూరం చేస్తుంది. రోజూ సపోటాను తీసుకుంటే రక్తవృద్ధి చెందుతుంది. 
 
మామిడి పండు: మామిడిలో విటమిన్ ఎ పుష్కలంగా వుంది. దీన్ని తీసుకుంటే శరీరంలో రక్తవృద్ధి అధికమవుతుంది. శరీరానికి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
జామపండు : జామపండులో విటమిన్ సి పుష్కలంగా వుంది. పెరిగే పిల్లలకు విటమిన్ సి చాలా ముఖ్యం. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలను పటిష్టంగా వుండేలా చేస్తుంది. 
 
దానిమ్మ: రోజూ దానిమ్మ పండు రసాన్ని తీసుకోవడం ద్వారా.. శరీరానికి కొత్త ఉత్సాహం లభిస్తుంది. మెదడుకు చురుకుదనం లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగ్గా వుంటుంది. మానసిక ఒత్తిడి దూరమవుతుంది.
 
వీటితో పాటు ఎండు ద్రాక్షను రోజూ తీసుకుంటే వేసవికాలంలో ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఎండుద్రాక్షలను బాగా నీటిలో కడిగి.. ఆవు పాలలో వేసి మరిగించి ఆరనివ్వాలి. ఆపై పాలలో మరిగించిన ద్రాక్షలను తీసుకుంటే.. ఆ పాలను తీసుకుంటే అజీర్తి సమస్యలు వుండవు. ఇందులోని క్యాల్షియం.. ఎముకలకు, దంతాల బలానికి సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments