Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఈ పండ్లు తీసుకుంటే..? ఎండు ద్రాక్షలలో పాలలో మరిగించి? (video)

Webdunia
గురువారం, 21 మే 2020 (15:07 IST)
అసలే వేసవి కాలం. ఎండలు వేడెక్కిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేసవిలో నీటిశాతం ఎక్కువగా వుండే పండ్లను తీసుకోవాలని అందరికీ తెలుసు. అందుకే పుచ్చకాయ, కీరదోస, కొబ్బరిబోండాం వంటివి తీసుకుంటుంటాం. అయితే వీటితో పాటు కొన్ని పండ్లను తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ పండ్లు ఏంటో ఓసారి చూద్దాం.. 
 
అరటిపండ్లు: జీర్ణశక్తికి రోజూ రాత్రి పూట అరటిపండును తీసుకోవడం మంచిది. అరటిలో కొవ్వు పదార్ధం చాలా అల్ప మోతాదులో ఉంటుంది. శరీరంలోని విషపదార్ధాలను ఇది చక్కగా తొలగిస్తుంది. డయేరియాను తగ్గించడంలో అరటి పండ్లు ఎంతగానో సహాయపడతాయి.
 
సపోటా: సపోటా పండు చర్మానికి తేమనిస్తుంది. ఇంకా చర్మంపై వున్న ముడతలను దూరం చేస్తుంది. రోజూ సపోటాను తీసుకుంటే రక్తవృద్ధి చెందుతుంది. 
 
మామిడి పండు: మామిడిలో విటమిన్ ఎ పుష్కలంగా వుంది. దీన్ని తీసుకుంటే శరీరంలో రక్తవృద్ధి అధికమవుతుంది. శరీరానికి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
జామపండు : జామపండులో విటమిన్ సి పుష్కలంగా వుంది. పెరిగే పిల్లలకు విటమిన్ సి చాలా ముఖ్యం. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలను పటిష్టంగా వుండేలా చేస్తుంది. 
 
దానిమ్మ: రోజూ దానిమ్మ పండు రసాన్ని తీసుకోవడం ద్వారా.. శరీరానికి కొత్త ఉత్సాహం లభిస్తుంది. మెదడుకు చురుకుదనం లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగ్గా వుంటుంది. మానసిక ఒత్తిడి దూరమవుతుంది.
 
వీటితో పాటు ఎండు ద్రాక్షను రోజూ తీసుకుంటే వేసవికాలంలో ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఎండుద్రాక్షలను బాగా నీటిలో కడిగి.. ఆవు పాలలో వేసి మరిగించి ఆరనివ్వాలి. ఆపై పాలలో మరిగించిన ద్రాక్షలను తీసుకుంటే.. ఆ పాలను తీసుకుంటే అజీర్తి సమస్యలు వుండవు. ఇందులోని క్యాల్షియం.. ఎముకలకు, దంతాల బలానికి సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Woman: 25వ అంతస్థు నుంచి కింద పడిపోయిన యువతి.. ఏం జరిగింది?

హెచ్1బి వీసా ఫీజు పెంపు... అమెరికా కంపెనీలపై రూ.1.23 లక్షల కోట్ల భారం

ఈవీఎంలను కాంగ్రెస్ హ్యాక్ చేస్తే ఎవరూ అడగలేదు.. మేం చేస్తే మాత్రం : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా

Nara Lokesh : మెగా డీఎస్సీ వేడుక.. పవన్‌కు నారా లోకేష్ ఆహ్వానం

మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వైకాపా నేతలు 106 కేసులు వేశారు : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ (video)

Mardaani 3: నవరాత్రి ఆరంభం సందర్భంగా రాణి ముఖర్జీ మర్దానీ 3 పోస్టర్ విడుదల

అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్‌లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా

ఓజీ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం పవన్

వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్, OG ట్రైల‌ర్‌పై హీరో సాయి దుర్గ తేజ్‌రివ్యూ

తర్వాతి కథనం
Show comments