Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ రోగులా.. పదేళ్ల జీవిత కాలం కట్టయినట్లేనట

యాబై ఏళ్లలోపు మధుమేహ వ్యాధికి గురయినవారి జీవితంలో పదేళ్లు కోతపడినట్లేనని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 50 లక్షల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులపై చేసిన పరిశోధన అలాంటి వారి జీవిత కాలంలో పదేళ్ళు హరించుకుపోయినట్లేనని తేల్చి చెబుతోంది.

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (04:20 IST)
యాబై ఏళ్లలోపు మధుమేహ వ్యాధికి గురయినవారి జీవితంలో పదేళ్లు కోతపడినట్లేనని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 50 లక్షల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులపై చేసిన పరిశోధన అలాంటి వారి జీవిత కాలంలో పదేళ్ళు హరించుకుపోయినట్లేనని తేల్చి చెబుతోంది. టైప్ 2 మధుమోహం ఊబకాయంతో ముడిపడి ఉంటుందని అందరికీ తెలుసు. టైప్ 2 వ్యాధిగ్రస్తులు ఊబకాయం కారణంగా గుండెపోటు, గుండె వ్యాధికి గురయ్యే అవకాశాలు 50 శాతం ఎక్కువగా ఉంటాయట. తాజా పరిశోధన ప్రకారం 50 ఏళ్ల లోపు వయస్సులో మధుమేహానికి గురైనవారు 75 ఏళ్ల వయస్సులోపే చనిపోయే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. 
 
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 50 లక్షల మంది చైనీయుల్లో 50 ఏళ్లలోపువారు మధుమేహానికి గురైతే వారి జివిత కాలం లో కనీసం 9 ఏళ్లు వ్యాధి కారకంగా హరించుకుపోయిందని తేలింది. అయితే జీవన శైలిలో మార్పులు చేసుకున్న వారు నాటకీయంగా ముందస్తు మరణాలకు గురయ్యే స్థితినుంచి బయటపడుతున్నారని ఈ పరిశోధనా బృంద నేత ప్రొఫెసర్ జెంగ్‌మింగ్ చెన్ తెలిపారు.పాశ్చాత్య ఆహారంలో భాగమైన కొవ్వు, తీపి పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడంతో జీవనశైలిలో మార్పులు తీసుకురావాలనుకుంటున్న ఆరోగ్య అధికారులు తీవ్రంగా శ్రమించాల్సివస్తోందని ఈ పరిశోధన పేర్కొంది. 
 
చిన్నవయస్సులోనివారు మధుమేహానికి గురవుతుండటం, వయోజనుల సంఖ్య పెరుగుతుండటం కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల వార్షిక మరణాల సంఖ్య పెరుగుతోందని, వ్యాధి నిర్ధారణ, చికిత్స పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోనివారు మృత్యువాతకు సులభంగా గురవుతున్నారని ఈ పరిశోధన హెచ్చరించింది. పాశ్చాత్య జీవనశైలి అలవర్చుకున్న కారణంగా చైనాలో గత కొన్ని దశాబ్దాల కాలంలోనే పది కోట్లకు పైగా వయోజనులు మధుమేహ బారినపడ్డారని, వీరిలో 50 ఏళ్లలోపులో మధుమేహ బారిన పడ్డవారు చాలావరకు వచ్చే 25 ఏళ్లలో మృత్యువాత పడే అవకాశాలు చాలా ఎక్కువని ఈ పరిశోధన తెలిపింది.
 
బ్రిటన్ రోగులు అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వల్ల తమ వ్యాధి పట్ల జాగరూకులై ఉన్నారని, చైనాలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ప్రొఫెసర్ చెన్ చెబుతున్నారు. అయితే మధుమోహ వ్యాధిగ్రస్తులు భయపడాల్సిన పనిలేదని, రోజూ శారీరక శ్రమ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం చేస్తే వారు ప్రమాదం నుంచి తప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెన్ చెప్పారు. 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments