Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇనుములాంటి దేహం కావాలంటే మినుములు తీసుకోండి..

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:29 IST)
మినుములు తింటే ఇనుము అంత బలం అని మన ఇంట్లో అంటుంటారు. వీటిలో ఉన్న పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని, అలాగే రకరకాల జబ్బులను నివారిస్తాయని వైద్యులు అంటున్నారు. వంద గ్రాముల మినుముల్లో 18గ్రాముల పీచు(ఫైబర్) ఉంటుంది. 
 
ఒక గ్రాము పొటాషియం, రెండు గ్రాముల కొవ్వుతో పాటు విటమిన్ సీ, విటమిన్ బీ- కాంప్లెక్స్‌లోని బీ1,బీ3 వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ కూడా ఎక్కువే. మినుములలో మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం ఉంది. కాబట్టి గాయాలైన వారికి, అవి త్వరగా తగ్గేందుకు మినుములు మంచి ఆహారంగా అందిస్తారు. 
 
మినుముల్లో దాదాపు 72 శాతం ఫీచు ఉండటం వల్ల మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు కూడా మందులకు బదులు మినుములతో చేసిన వంటకాలను తినవచ్చని ఆహార నిపుణులు అంటున్నారు. గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణం మినుములకు ఉంది. 
 
ఇందుకు మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే కారణం. అవి రక్తంలోకి వెలువడే చక్కెర, కొలెస్ట్రాల్ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. పొటాషియం వల్ల రక్తపోటు తగ్గుతుంది. 
 
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే గుణం కూడా మినుములకు ఉంది. స్వాభావికమైన పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ సమస్య ఉన్న వారికి మినుములు మంచి ఆహారం మినుములను ఏ కాలంలో అయినా తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments