Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీని ఎక్కువ సమయం చూస్తూ స్నాక్స్ తినేవారు.. కాస్త జాగ్రత్త..!

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (16:59 IST)
సాధారణంగా మనలో చాలా మంది టీవీ చూసే సమయంలో అదే పనిగా స్నాక్స్‌ని లాంగించేస్తుంటారు. అయితే అలాంటి వారు ఇక జాగ్రత్త పడక తప్పదు. టీవీ చూస్తూ స్నాక్స్ తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇది సరదాకి చెబుతున్న విషయం కాదు సుమీ..సైంటిస్టులు పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.
 
బ్రెజిల్ దేశానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలు అక్కడే నివాసం ఉంటున్న 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సున్న 33,900 మంది టీనేజర్ల ఆహారపు అలవాట్లు, వారికి ఉన్న వ్యాధులు, వారి జీవనశైలి తదితర అంశాల సమాచారాన్ని మొత్తం సేకరించి విశ్లేషించారు. దీంతో అసలు విషయం బయటపడింది. 
 
నిత్యం 6 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారిలో కొందరికి మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు గుర్తించారు. మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉంటే డయాబెటిస్‌, గుండె జబ్బులు త్వరగా వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. కనుక టీవీ ఎక్కువగా చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారు ఆ అలవాటును మానుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments