టీవీని ఎక్కువ సమయం చూస్తూ స్నాక్స్ తినేవారు.. కాస్త జాగ్రత్త..!

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (16:59 IST)
సాధారణంగా మనలో చాలా మంది టీవీ చూసే సమయంలో అదే పనిగా స్నాక్స్‌ని లాంగించేస్తుంటారు. అయితే అలాంటి వారు ఇక జాగ్రత్త పడక తప్పదు. టీవీ చూస్తూ స్నాక్స్ తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇది సరదాకి చెబుతున్న విషయం కాదు సుమీ..సైంటిస్టులు పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.
 
బ్రెజిల్ దేశానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలు అక్కడే నివాసం ఉంటున్న 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సున్న 33,900 మంది టీనేజర్ల ఆహారపు అలవాట్లు, వారికి ఉన్న వ్యాధులు, వారి జీవనశైలి తదితర అంశాల సమాచారాన్ని మొత్తం సేకరించి విశ్లేషించారు. దీంతో అసలు విషయం బయటపడింది. 
 
నిత్యం 6 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారిలో కొందరికి మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు గుర్తించారు. మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉంటే డయాబెటిస్‌, గుండె జబ్బులు త్వరగా వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. కనుక టీవీ ఎక్కువగా చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారు ఆ అలవాటును మానుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

బార్‌లో పని.. మహిళా ఉద్యోగిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోబోయాడు.. (video)

ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments