Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేయాన్ని చింతపండు ఎలా రక్షిస్తుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (22:56 IST)
కామెర్లు, ఇతర హెపాటిక్ సమస్యలను ఎదుర్కొనడానికి చింతపండు ఉపయోగపడుతుంది. చింతపండులో ఆస్కార్బిక్ ఆమ్లం, బీటా కెరోటిన్ ఉన్నాయి, ఇవి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటాయి.
 
ఇది ఔషధ ప్రేరిత విషప్రయోగం నుండి కాలేయ కణాలను రక్షిస్తుంది. కాలేయ కణాలను పునరుత్పత్తి చేయడానికి, కాలేయ ఎంజైమ్‌ల స్థాయిని తగ్గించడానికి మరియు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. దాని ఆకలి స్వభావం కారణంగా ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. దాని పునరుజ్జీవనం లక్షణం కారణంగా కాలేయ కణాల పునరుత్పత్తికి కూడా ఇది సహాయపడుతుంది.
 
చింతపండులో గల ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
1. చింతపండులో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. చింతపండు హెల్తీ ఇంగ్రిడియంట్‌గా మారింది. అలాగే చింతపండు వంటకాలను గొంతు నొప్పి, వాపు, సన్ స్ట్రోక్, దగ్గు, జ్వరం నివారించడానికి ఉపయోగిస్తారు.
 
2. చింతపండులో హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఫ్యాట్ ఉత్పత్తి తగ్గిస్తుంది. ఇది సిట్రిక్ యాసిడ్ వంటిది. హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్‌ను ఇతర మొక్కల్లో కూడా కనుగొనడం జరిగింది. ఇది శరీరంలో ఎంజైమ్స్‌ను గ్రహిస్తుంది. ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది. దాంతో బరువు తగ్గుతారు.
 
3. చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. అలాగే హానికారక ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు. అలాగే.. కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గించే మినరల్స్ ఇందులో ఉంటాయి. అలాగే పొట్టలో, ప్రేగుల్లో చిన్న పుండ్లు ఏర్పడి బాధ కలుగుతుంది. ఇటువంటి పరిస్థితి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
 
4. చింతపండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల.. బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్ ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది. చింతపండులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డిఎల్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ పెరిగేందుకు సహాయపడుతుంది. ఫ్యాట్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. హై బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది.
 
5. చింత పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచుతుంది. దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. చింతపండు నీళ్లను టీ రూపంలో తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ గగనతలం మూసివేత - ఎయిరిండియా విమానాల దారిమళ్లింపు

హనీమూన్ మర్డర్ కేసు : సోనమ్‌ను పట్టించిన మంగళసూత్రం - ఉంగరం

బ్లాక్‌బాక్స్ డీకోడ్ చేస్తేనే ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి : ఎస్ఎన్ రెడ్డి

పెను విషాదం ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ...

ఆ ఒక్కడు మినహా మిగిలిన వారంతా చనిపోయారు... ఎయిరిండియా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

తర్వాతి కథనం
Show comments